
* అమెరికాపై భద్రతా మండలికి ఇరాక్ ఫిర్యాదు
ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ను మీడియా ఛానెల్ ప్రసారం చేసింది.
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
కాగా, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితుల గురించి వివరంగా చర్చించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు మోదీ వివరించారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, దౌత్య చర్చలు జరపాలని సూచించినట్లు మోదీ పోస్టు చేశారు.
అమెరికా దాడులను బ్రిటన్ సమర్థించింది. ఇరాన్ అణు కార్యక్రమం అంతర్జాతీయ భద్రతకు తీవ్ర ముప్పని, ఇరాన్ దగ్గర అణ్వస్త్రం ఎప్పటికీ ఉండకూడదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. ఆ ముప్పును తగ్గించడానికి అమెరికా చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని అంతం చేయడానికి చర్చలకు తిరిగి రావాలని ఇరాన్ను కోరుతున్నట్లు తెలిపారు.
మరోవైపు అణుకేంద్రాలపై అమెరికా దాడులను లాటిన్ అమెరికా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులను అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన కిందకే వస్తాయని తెలిపాయి. ఈ చర్యలు పశ్చిమాసియాలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని, అన్ని పక్షాలు దౌత్యపరమైన చర్చలకు తిరిగి రావాలని వెనిజులా, చిలీ, కొలంబియా దేశాల అధినేతలు తెలిపారు.
అమెరికా తమ గగనతలాన్ని ఉల్లంఘించిందని ఐరాస భద్రతామండలికి ఇరాక్ ఫిర్యాదు చేసింది. పొరుగు దేశాల భద్రతను అమెరికా చర్యలు ప్రమాదంలో పడేస్తున్నాయని, తమ దేశాన్ని యుద్ధ భూమిగా మార్చేందుకు అనుమతించబోమని లెబనాన్, జోర్డాన్ స్పష్టం చేశాయి. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించే ప్రమాదకరమైన, నిర్లక్ష్యపు చర్యగా ఒమన్ అభివర్ణించింది. ఎర్ర సముద్రంలో అమెరికా వాణిజ్య, నౌకాదళ ఓడలను లక్ష్యంగా చేసుకుంటామని హూతీ రెబల్స్ హెచ్చరించారు..మరోవైపు అమెరికా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని పాక్ ఆందోళన వ్యక్తం చేసింది.
More Stories
భారత్కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!