
అమెరికాలో అస్థిర పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు ఇప్పుడు ఇతర దేశాల వైపు చూస్తున్నారు. విద్యార్థులు అమెరికా బదులుగా హాంకాంగ్, యూకే, యూరప్, ఆస్ట్రేలియాల పట్ల ఆసక్తి చూపే పరిస్థితులు నెలకొంటున్నాయి. హాం కాంగ్లో స్కాలర్షిప్, ఆర్థిక సాయం వంటి అవకాశాలు కూడా లభిస్తాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికా చదువుల పట్ల ప్రోత్సహిస్తూనే వారి భద్రతను, మనశ్శాంతిని పణంగా పెట్టేందుకు సిద్దపడటం లేదు.
అమెరికా విధాన మార్పులతో ప్రతి ఒక్కరి ఆర్థిక స్థిరత్వం, వారి పిల్లల భవిష్యత్తు రెండూ ప్రమాదంలో పడ్డాయని ఆందోళన చెందుతున్నారు. అస్పష్టమైన, లేదంటే చిన్నచిన్న కారణాలకే విద్యార్థులను బహిష్కరించడం వల్ల ఆ కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
కాగా, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకు తాత్కాలిక విరామం తర్వాత విద్యార్థి వీసాల మంజూరు ప్రక్రియను అమెరికా ప్రారంభించింది. కానీ, దరఖాస్తుదారులు స్క్రీనింగ్ సమయంలో తప్పనిసరిగా సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు సమర్పించాలని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేేశాంగ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
“వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను యూఎస్ కాన్సులర్ అధికారులు తనిఖీ చేస్తారు. అందుకోసం విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేటు సెట్టింగ్స్ను మార్చుకుని పబ్లిక్గా అన్లాక్ చేయాల్సి ఉంటుంది. దీంతో మన దేశంలో వచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తుంది. అప్పుడే విద్యార్థులకు వీసా అనుమతి ఇవ్వాలా, వద్దా అనేది నిర్ణయిస” అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
More Stories
కోయంబత్తూరు పేలుళ్ల నిందితుడు 29 ఏళ్ళకు అరెస్ట్
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!