
గత 11 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో అసాధారణ పురోగతి సాధించిందని, ఈ అభివృద్ధి స్థిరమైన మోదీ నాయకత్వం ఉండటంవల్లే సాధ్యమైందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన “మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల అభివృద్ధి ” కార్యక్రమాలపై పుస్తకాన్ని విడుదల చేస్తూ గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, ఇది దేశ ప్రజల నమ్మకానికి నిదర్శనమని తెలిపారు.
పేద, అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా మోదీ పాలన ఉండిందని పేర్కొంటూ రైతులు, యువత, మహిళలు ఈ నాలుగు ప్రధాన విభాగాల అభివృద్ధి కోసమే ప్రతి కార్యక్రమం రూపకల్పన చేశారని చెప్పారు. భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇటీవలే 4 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారిందని తెలిపారు. పన్నుల వ్యవస్థలో సమగ్ర మార్పులు చేసి, జీఎస్టీ ద్వారా “వన్ నేషన్ వన్ ట్యాక్స్” లక్ష్యాన్ని సాధించామని తెలిపారు.
2014లో 6.91 కోట్ల పన్నులు కట్టే వారు ఉండగా, ఇప్పుడు 15.66 కోట్లకు పెరిగిందని వివరించారు. అలాగే మోదీ ప్రభుత్వం రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని తెలుపుతూ వ్యవసాయ బడ్జెట్ 25,633 కోట్ల నుంచి 1.33 లక్షల కోట్లకు పెరిగిందని, 82% వరకు గిట్టుబాటు ధరలు పెరిగినట్లు వెల్లడించారు. 11 కోట్ల మంది రైతులకు ” కిసాన్ సమ్మాన్ నిధి ” ద్వారా ఏటా నేరుగా రైతు అకౌంట్ లోకి నగదు అందిస్తామని పేర్కొన్నారు.
అలాగే ఉగ్రవాదం విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ అనుసరిస్తున్నామని చెప్పారు. పఠాన్ కోట్ సర్జికల్ స్ట్రైక్, పహల్గావ్ దాడి, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు భారత్ శక్తిని చాటిచెప్పినట్టు పేర్కొన్నారు. బ్రహ్మోస్, బ్రహ్మాస్త్రం వంటి సామర్థ్యాలు దేశ రక్షణను మరింత బలంగా తీర్చిదిద్దాయని తెలిపారు.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
యోగా దినోత్సవంకు ముస్తాబవుతున్న విశాఖ
గోదావరి జలాలపై కలిసి మాట్లాడుకొందాం