
ఈద్-ఉల్- అధా సందర్భంగా మహమ్మద్ యూనస్కు, బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. భారతదేశపు ఘనత దాని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగానే వచ్చిందని తెలిపారు. శాంతియుతమైన, సమ్మిళితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో త్యాగం, కరుణ, సోదరభావం విలువలను ఇది మనకు గుర్తు చేస్తుందని మోదీ తెలిపారు.
దీనికి స్పందిస్తూ యూనస్ మరో లేఖ రాశారు. ప్రధాని మోదీ ఆలోచనాత్మక సందేశం ఇరు దేశాల మధ్య ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని అందులో పేర్కొన్నారు. ఈ పండుగ చాటిచెప్పే త్యాగం, దాతృత్వం, ఐక్యతా విలువలు ప్రజలను ఒకచోటకు చేరుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కలిసి పనిచేసేందుకు ప్రేరణ కల్పిస్తాయని చెప్పారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీకి, భారత ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. “పరస్పర గౌరవం, అవగాహన స్ఫూర్తి భారత్, బంగ్లా ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. బక్రీద్ పండుగ త్యాగం, దాతృత్వం, ఐక్యత స్ఫూర్తితో సమాజాలను ఒకచోట చేర్చుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల గొప్ప ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడానికి మనందరినీ ప్రేరేపిస్తుంది” అని యూనస్ తన లేఖలో తెలిపారు.
More Stories
పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై ట్రంప్ కన్ను!
పాక్ కు చైనా ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ల సరఫరా
ఇరాన్పై బలప్రయోగం వద్దని చైనా, రష్యా హెచ్చరికలు