
కాంగ్పోక్పి జిల్లాలోని కోట్జిమ్ గ్రామంలో జరిగిన గాలింపు చర్యలో మూడు తుపాకులు, ఎనిమిది షార్ట్బేరల్ తుపాకులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెంగ్నౌపాల్ జిల్లాలోని యాంగౌబుంగ్ గ్రామంలో గురువారం నాలుగు అధునాతున పేలుడు పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, మెయితీ తెగకు చెందిన వాలంటీర్ గ్రూప్ అరంబాయ్ టెంగోల్ నాయకుడు కానన్ సింగ్ను పోలీసులు ఇంఫాల్లో శనివారం అరెస్టు చేయడంతో మెయితీ తెగకు చెందిన యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు.
షాపులను ధ్వంసం చేయడంతోపాటు రోడ్లపై టైర్లను కాల్చివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. తాజా ఉద్రిక్తల నేపథ్యంలో శనివారం రాత్రి 11.45 గంటల నుంచి ఐదు లోయ జిల్లాల్లో ఇంటర్నేట్, మొబైల్ డేటా సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ఆంక్షలు ఐదు రోజులపాటు అమల్లో ఉంటాయని పేర్కొంది.
సరిహద్దు ప్రాంతాలలో భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారలు తెలిపారు. మణిపూర్లో రెండు ఏళ్ల క్రితం జాతి హింస చెలరేగినప్పటి నుండి భద్రతా దళాలు గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. మే 2023 నుండి మెయిటీలు, కుకీ-జో వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో 260 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.
More Stories
కోయంబత్తూర్ కారు బాంబు కేసులో మరో నలుగురు అరెస్ట్
వీసాల అనిశ్చితతో అమెరికాలో చదువులపై వెనకడుగు!
విశ్లేషణ కోసం విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్