
అదే జోరును కొనసాగించడంలో చోప్రా ఒకింత విఫలమయ్యాడు. నాలుగో ప్రయత్నంలో 80.56మీటర్లు విసిరిన నీరజ్ ఐదోసారి ఫౌల్ అయ్యాడు. ఆఖరిదైన ఆరో త్రోలో నీరజ్ 88.20మీటర్లకు పరిమితమయ్యాడు. ఇదే అదనుగా అప్పటి వరకు చోప్రా దరిదాపుల్లో ఉన్న జులియన్ వెబర్ ఆరో ప్రయత్నంలో ఏకంగా 91.06మీటర్లు విసిరి అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు.
కెరీర్లో తొలిసారి అత్యుత్తమ మార్క్ అందుకున్న వెబర్..నీరజ్ను రెండో స్థానానికి పరిమితం చేయగా, అండర్సన్ పీటర్స్(85.64మీ)మూడో స్థానంలో నిలిచాడు. కాగా, కెరీర్ బెస్ట్ త్రో చేసిన నీరజ్ చోప్రాపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా అభినందించారు.
అద్భుతమైన మైలురాయిని సాధించావు, దేశం ఉప్పొంగి, గర్వంగా ఉంది అంటూ నీరజ్ను ప్రధాని మెచ్చుకున్నారు. “అద్భుతమైన ఫీట్! దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు నీరజ్ చోప్రాకు అభినందనలు. ఇది అతని అవిశ్రాంత అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచికి దక్కిన ఫలితం. భారతదేశం ఉప్పొంగి, గర్వంగా ఉంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
More Stories
ఇరాన్ అధ్యక్షుడి హత్యకు ఇజ్రాయిల్ యత్నం?
అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం
పాకిస్థాన్ లో ‘రామాయణం’ డ్రామాకు ప్రశంసలు