
కాగా, మే 8-9వ తేదీల మధ్య రాత్రి వేళ భారత్లోని 36 నగరాలపై జరిగిన దాడిలో 300 నుంచి 400 వరకు టర్కిష్ డ్రోన్లను పాకిస్తాన్ సైన్యం ప్రయోగించిందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. భారత్ ధీటుగా ప్రతిస్పందించిందని చెప్పారు. పాక్ డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించారు. కూలిన డ్రోన్ శిథిలాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా టర్కీలో తయారైన ‘అసిస్గార్డ్ సోంగర్’ మోడల్ డ్రోన్స్గా నిర్ధారణ అయ్యిందన్నారు.
మరోవైపు పాకిస్థాన్లోని నాలుగు వైమానిక రక్షణ ప్రదేశాలపై సాయుధ డ్రోన్లను భారత్ ప్రయోగించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ఆ డ్రోన్స్లో ఒకటి ఏడీ రాడార్ను నాశనం చేసిందని చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి భారీ క్యాలిబర్ ఆయుధాలతో పాక్ కాల్పులు జరిపిందని, పంజాబ్లోని బటిండా సైనిక స్థావరంపై దాడికి ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.
భారత్ జరిపిన ప్రతీకార కాల్పుల్లో పాకిస్థాన్ సైన్యానికి కూడా భారీ నష్టం వాటిల్లిందని వివరించారు. మరోవైపు భారత్తో నెలకొన్న ఉద్రిక్తతలకు మతం రంగు పులిమేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నదని విక్రమ్ మిస్రి ఆరోపించారు. దీనిని తిప్పికొట్టడంతోపాటు వాస్తవాన్ని అంతర్జాతీయ సమాజానికి భారత్ తెలియజేస్తున్నదని వివరించారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాక్ చెప్పడం అబద్ధమని పేర్కొంటూ గురుద్వారాలు, ఆలయాలే టార్గెట్ గా పాకిస్తాన్ కుట్రలు చేస్తుండటంతో ఇప్పటికే కర్తార్ పూర్ కారిడార్ మూసివేశామని వివరించారు. పాక్ ఎయిర్ స్పేస్ ను మూసి వేయకుండా మనవైపు దాడులకు తెగబడుతున్నదని తెలిపారు.
గురువారం రాత్రి పాక్ మనపై దాడులు చేస్తున్న సమయంలో కరాచీ నుంచి లాహోర్ కు పౌరవిమానం ప్రయాణిస్తున్నది తెలిపారు. దీంతో మన వైమానికి దళం ఎటువంటి దాడులకు దిగకుండా సంయమనం పాటించిదని చెప్పారు. భారత గగనతలంలోకి గత రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు, యుద్ధ విమానాలు రాగా, వచ్చిన వాటిని వచ్చినట్లే కూల్చివేశామని వ్యోమికా సింగ్ చెప్పారు.
4 ఎయిర్ పోర్టులు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించిందని, 36 చోట్ల చొరబాట్లకు యత్నించింది కల్నల్ సోఫియా వెల్లడించారు. భటిండా, ఉధంపూర్ ఎయిర్ పోర్టులే లక్ష్యంగా పాక్ దాడులు చేసిందన్నారు.
More Stories
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు
మావోయిస్టు అగ్రనేత హతంపై ప్రధాని, హోంమంత్రి హర్షం