300- 400 టర్కీ డ్రోన్లతో పాక్‌ దాడి చేసింది

300- 400 టర్కీ డ్రోన్లతో పాక్‌ దాడి చేసింది
సుమారు 300 నుంచి 400 టర్కీ డ్రోన్లతో పాకిస్థాన్‌ దాడి చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సరిహద్దుల్లోని 36 ప్రదేశాలను పాక్‌ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిందని పేర్కొంది. అయితే భారత సైనిక దళాలు సమర్థవంతంగా పాక్‌ డ్రోన్లను కూల్చివేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వివరించారు.

కాగా, మే 8-9వ తేదీల మధ్య రాత్రి వేళ భారత్‌లోని 36 నగరాలపై జరిగిన దాడిలో 300 నుంచి 400 వరకు టర్కిష్ డ్రోన్‌లను పాకిస్తాన్ సైన్యం ప్రయోగించిందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. భారత్‌ ధీటుగా ప్రతిస్పందించిందని చెప్పారు. పాక్‌ డ్రోన్‌లను కూల్చివేసినట్లు వెల్లడించారు. కూలిన డ్రోన్‌ శిథిలాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా టర్కీలో తయారైన ‘అసిస్‌గార్డ్ సోంగర్’ మోడల్‌ డ్రోన్స్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు.

మరోవైపు పాకిస్థాన్‌లోని నాలుగు వైమానిక రక్షణ ప్రదేశాలపై సాయుధ డ్రోన్‌లను భారత్‌  ప్రయోగించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ఆ డ్రోన్స్‌లో ఒకటి ఏడీ రాడార్‌ను నాశనం చేసిందని చెప్పారు.  నియంత్రణ రేఖ వెంబడి భారీ క్యాలిబర్ ఆయుధాలతో పాక్‌ కాల్పులు జరిపిందని, పంజాబ్‌లోని బటిండా సైనిక స్థావరంపై దాడికి ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. 

భారత్ జరిపిన ప్రతీకార కాల్పుల్లో పాకిస్థాన్‌ సైన్యానికి కూడా భారీ నష్టం వాటిల్లిందని వివరించారు. మరోవైపు భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతలకు మతం రంగు పులిమేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తున్నదని  విక్రమ్ మిస్రి ఆరోపించారు. దీనిని తిప్పికొట్టడంతోపాటు వాస్తవాన్ని అంతర్జాతీయ సమాజానికి భారత్‌ తెలియజేస్తున్నదని వివరించారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాక్ చెప్పడం అబద్ధమ‌ని పేర్కొంటూ గురుద్వారాలు, ఆలయాలే టార్గెట్ గా పాకిస్తాన్ కుట్రలు చేస్తుండ‌టంతో ఇప్ప‌టికే కర్తార్ పూర్ కారిడార్ మూసివేశామ‌ని వివ‌రించారు. పాక్ ఎయిర్ స్పేస్ ను మూసి వేయ‌కుండా మ‌న‌వైపు దాడుల‌కు తెగ‌బ‌డుతున్న‌ద‌ని తెలిపారు. 

అంతర్జాతీయ ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్ సంయమనం పాటించింనద‌ని చెబుతూ భారత నగరాలు, విమానాశ్రయాలు మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసింద‌ని వివ‌రించారు.  ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ నిరంతరం కాల్పులు జరుపుతుంద‌ని పేర్కన్నారు. గ‌త రాత్రి . లేహ్ నుంచి సర్ క్రిక్ వరకు 36 చోట్ల పాకిస్తాన్ దాడులు చేసింద‌ని తెలిపారు. మన గురుద్వారాల మీద దాడి చేయడం ద్వారా దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని పాక్ ప్రయత్నించింది చెప్పారు. సరిహద్దుల్లో భారీ ఆర్టిలరీలతో పాకిస్తాన్ కాల్పులు జరపుతోంద‌ని చెప్పారు వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్. భారత్ ఎదురు దాడిలో పాకి సైన్యానికి భారీ నష్టం జరిగింద‌ని చెబుతూ పౌర విమానాశ్రాయలను పాకిస్తాన్ రక్షణగా వాడుకొని దాడులకు దిగుతుంద‌ని ఆమె మండిప‌డ్డారు.

గురువారం రాత్రి పాక్ మ‌న‌పై దాడులు చేస్తున్న స‌మ‌యంలో క‌రాచీ నుంచి లాహోర్ కు పౌర‌విమానం ప్ర‌యాణిస్తున్న‌ది తెలిపారు. దీంతో మ‌న వైమానికి ద‌ళం ఎటువంటి దాడుల‌కు దిగ‌కుండా సంయ‌మ‌నం పాటించిద‌ని చెప్పారు. భారత గగనతలంలోకి గ‌త రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు, యుద్ధ విమానాలు రాగా,  వ‌చ్చిన వాటిని వ‌చ్చిన‌ట్లే కూల్చివేశామ‌ని వ్యోమికా సింగ్ చెప్పారు.

4 ఎయిర్ పోర్టులు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింద‌ని, 36 చోట్ల చొరబాట్లకు యత్నించింది క‌ల్న‌ల్ సోఫియా వెల్ల‌డించారు. భటిండా, ఉధంపూర్ ఎయిర్ పోర్టులే లక్ష్యంగా పాక్ దాడులు చేసింద‌న్నారు.