పాక్ లోని 8 వైమానిక స్థావరాలు ధ్వంసం

పాక్ లోని 8 వైమానిక స్థావరాలు ధ్వంసం
పాకిస్థాన్ సైన్యం శుక్రవారం రాత్రి భారత భూభాగంలోని పలు ప్రాంతాలపై డ్రోన్లు, శతఘ్నులతో దాడులకు పాల్పడగా, భారత బలగాలు దీటుగా స్పందించాయి. పాకిస్థాన్‌లోని 8 కీలక వైమానిక స్థావరాలతోపాటు డ్రోన్ లాంచ్‌ప్యాడ్స్‌పై భారత్ ప్రతిదాడులు నిర్వహించింది. దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన రహిమ్యార్ ఏయిర్‌బేస్‌ను భారత్ ధ్వంసం చేసింది. ఈ ఏయిర్‌బేస్ రాజస్తాన్ సరిహద్దు ప్రాంతానికి అతి దగ్గరలో ఉంది. 
మిలటరీ కార్యకలాపాలతో పాటు సివిల్ ఏవియేషన్‌కు కూడా పాక్ దీన్ని వాడుతోంది. చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఏయిర్‌బేస్, ఇంటర్‌నేషనల్ ఏయిర్‌పోర్టును భారత్ ధ్వంసం చేసింది. పాకిస్థాన్‌ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశంలోని రఫీకి, మురిద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పస్రూర్, సియాల్‌కోట్‌లోని సైనిక లక్ష్యాలను ఐఏఎఫ్‌ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.

పాకిస్తాన్ దుస్సాహసానికి ప్రతిగా భారత బలగాలు రావల్పిండి సమీపంలోని చక్లాలాలో ఉన్న నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌, చక్వాల్‌లోని మురీద్‌ ఎయిర్‌బేస్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లోని రఫీకి వైమానిక స్థావరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి.  తమ వైమానిక స్థావరాలపై దాడులు జరిగిన విషయాన్ని పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్‌ చౌదురి ధ్రువీకరించారు.

పాకిస్తాన్‌లోని నాలుగు కీలకమైన వైమానిక స్థావరాలపై భారత్ రాత్రిపూట విజయవంతంగా దాడి చేసి, సైనిక స్థావరాలు, ఆస్తులకు భారీ నష్టం కలిగించిందని ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్, చక్వాల్‌లోని మురిద్, షోర్కోట్‌లోని రఫికి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో పాకిస్తాన్ మధ్యాహ్నం 12 గంటల వరకు తన గగనతలాన్ని మూసివేసింది. 

పెషావర్‌కు వెళ్లే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం పిఐఏ 218 పాకిస్తాన్ గగనతలంలో చివరి వైమానిక విమానం అని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్‌తో సహా ప్రధాన నగరాల్లో పేలుళ్లు సంభవించాయని పాక్ అధికారులు వెల్లడించారు.

పాకిస్తాన్‌లోని నాలుగు కీలకమైన వైమానిక స్థావరాలపై భారత్ రాత్రిపూట విజయవంతంగా దాడి చేసి, సైనిక స్థావరాలు, ఆస్తులకు భారీ నష్టం కలిగించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. రావల్పిండిలోని నూర్ ఖాన్, చక్వాల్‌లోని మురిద్, షోర్కోట్‌లోని రఫికి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడి చేశామ‌ని, అవి పూర్తిగా ధ్వంస‌మ‌య్యాని తెలిపారు. ప్రతిదాడుల్లో భాగంగా బాలిస్టిక్ క్షిపణులను వాడుతున్నామని తెలిపారు. కాగా, ఎస్-400ను ధ్వంసం చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారం చేసిందని సోఫియా ఖురేషి పేర్కొన్నారు.