
చెన్నై- విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును నర్సాపూర్ వరకు విస్తరించేందుకు దక్షణ మధ్య రైల్వే వేగంగా సన్నాహాలు చేస్తున్నది. రైల్వే బోర్డు అనుమతి వచ్చిన వెంటనే నరసాపురం చెన్నై మధ్య వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. ఈ రైలును విజయవాడలో ఎక్కువసేపు ఉంచడం వల్ల మిగిలిన రైళ్లకు ఇబ్బందిగా మారుతుంది. ప్లాట్ ఫాం లు ఖాళీ లేక అనేక రైళ్ళ సమయాలు మారుతున్న పరిస్థితి ఉంది.
ఈ క్రమంలో ఈ వందేభారత్ రైలును నర్సాపురం వరకు పొడిగిస్తే అక్కడి ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. తొలుత మచిలీపట్టణం వరకు పొడిగించాలని భావించినట్లు తెలుస్తున్నది. అయితే కేంద్ర మంత్రిగా ఉన్న నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ జోక్యం చేసుకొని తన నియోజకవర్గంకు విస్తరించేటట్లు చేస్తుకున్నారు. ఈ వందే భారత్ రైలును మొదటి భీమవరం వరకు పొడిగించాలని మొదట ప్రయత్నించినా, భీమవరంలో ఈ రైలును ఆపితే బోగిలలో నీళ్లు నింపడానికి అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని విరమించుకుంది.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏలూరు మీదుగా వందే భారత్ నడుస్తుందని, నరసాపురం వైపు కూడా వందే భారత్ నడిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని శ్రీనివాస వర్మ రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వందే భారత్ రైలు నరసాపురం వరకు కొనసాగితే కావాల్సిన మౌలిక సదుపాయాల పైన దృష్టి పెట్టి నరసాపురం రైల్వే స్టేషన్లో పనులు చేస్తున్నారు . రైళ్లకు నీటిని నింపే పైప్లైన్ పనులు చేపట్టారు. దాదాపు 70 శాతం ఈ పనులు పూర్తయినట్టు గా తెలుస్తుంది. అలాగే ట్రాక్ ని పటిష్టంగా ఉంచడానికి కూడా పనులు చేస్తున్నారు.
More Stories
సిరాజ్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 42 లక్షలు నగదు
రోహింగ్యాల వలసలతో అంతర్గత భద్రతకు ప్రమాదం
నాలుగన్నర గంటల్లోనే విజయవాడ నుండి తిరుపతి