
మే ఒకటి నుంచి రైల్వే టికెట్ నిబంధనలను కఠినతరం చేయబోతున్నది. వెయిటింగ్ టికెట్లు ఉన్నప్రయాణికులకు స్లీపర్ లేదంటే ఏసీ కోచ్లలో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. ప్రయాణికుడు వెయిటింగ్ టికెట్ ఉంటే జనరల్ కోచ్లలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రయాణికులకు వెయిటింగ్ టికెట్లతో స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణించడంపై నిషేధం అమలులో ఉంటుంది.
ఎవరైనా ఓ ప్రయాణికుడు స్లీపర్ కోచ్లో వెయిటింగ్ టికెట్తో ప్రయాణిస్తూ టీటీఈకి పట్టుబడితే అతనికి రూ.250 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. దాంతో పాటు స్లీపర్ క్లాస్ టికెట్ ఛార్జీ మొత్తం వసూలు చేస్తారు. దూరాన్ని బట్టి అదనంగా చార్జీ సైతం చెల్లించాల్సి రావొచ్చు. మరో వైపు ఓ ప్రయాణికుడు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్లలో వెయిటింగ్ టికెట్తో ప్రయాణిస్తే మరింత ఎక్కువ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది.
సదరు ప్రయాణికుడికి రూ.440 జరిమానా చెల్లించడంతో పాటు జనరల్ కోచ్కు పంపడం లేదంటే.. తర్వాత వచ్చే రైల్వేస్టేషన్లో దింపివేసే హక్కు టీటీఈకి ఉంటుంది. ఫస్ట్క్లాస్ ఏసీలో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి భారీగా జరిమానా విధించేందుకు ఆస్కారం ఉంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణించినందుకు గరిష్టంగా రూ.1000 జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.
More Stories
భారత్, అమెరికా జులై 8లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందం!
రన్యా రావు కేసులో హోంమంత్రి విద్యాసంస్థలో ఈడీ సోదాలు
రూ 6,000 కోట్లు దారి మళ్లించిన యూకో బ్యాంక్ మాజీ సీఎండీ