
వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ యూజీ పరీక్షను మే 4న పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పరీక్ష సందర్భంగా ఎటువంటి లోపాలకు తావులేకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని కలెక్టర్లు, ఎస్పీలతో వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. గత ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం, ఇతర అవాంతరాల కారణంగా పలు పరీక్షలు రద్దవ్వడంతో కేంద్రం ఈసారి పటిష్ట చర్యలు చేపట్టింది.
“నీట్ యూజీ పరీక్షను సజావుగా నిర్వహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కలెక్టర్లు, ఎస్పీలతో వరుస సమావేశాలు జరిగాయి. భద్రత, నిర్వహణ గురించి జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద ఎన్ టీఏ నియమించిన భద్రతతో పాటు జిల్లా పోలీసుల బహుళ స్థాయి తనిఖీలు ఉంటాయి” అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
“ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు వంటి సామగ్రి రవాణా పూర్తిగా గోప్యంగా పోలీసుల పర్యవేక్షణలో జరుగుతుంది. లీకేజీ, ఛీటింగ్ను అడ్డుకునేందుకు కోచింగ్ సెంటర్లు, డిజిటల్ ప్లాట్ ఫారమ్లను పోలీసులు పర్యవేక్షిస్తారు. నీట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వ్యక్తిగతంగా సందర్శిస్తారు.” అని ఆ వర్గాలువివరించాయి.
కాగా, గతేడాది నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్ష పత్రాలు లీకవ్వడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో ఈ రెండు పరీక్షలను వాయిదా వేసి, కొన్ని రోజుల తర్వాత నిర్వహించింది ఎన్ టీఏ. అలాగే పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా కేంద్రం గత ఏడాది ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. అలాగే పరీక్ష పేపర్లు లీక్ చేసిన వారికి పట్టుకునేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
More Stories
మరో పాక్ దౌత్యాధికారిపై భారత్ వేటు
5 ఏళ్ల తర్వాత 720 మందితో కైలాస మానస సరోవర యాత్ర
భారత్ లో 257 యాక్టివ్ కరోనా కేసులు