
* పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం, బిబిసికి నోటీసులు
నేహా సింగ్ రాథోడ్ ఓ పొలిటికల్ సెటైరిస్ట్. జానపద గాయని కూడా. భోజ్పురి పాటలు ఆమె పాడుతుంది. 1997లో పుట్టిందామె. బీహార్లోని జన్దాలో పెరిగింది. 2018లో ఆమె కాన్పూర్ వర్సిటీ నుంచి బిఎస్సీ పట్టా పొందింది. 2019లో బోజ్పురి పాటలు పాడడం ప్రారంభించింది. మొబైల్ ఫోన్లో రికార్డింగ్ చేసేది. వాటిని ఫేస్బుక్లో అప్లోడ్ చేసేది. భోజ్పురి కవులు బికారి థాకూరి, మహేందర్ మిస్రిలు తనకు ఇన్స్పిరేషన్ అని చెబుతోంది.
2020 మే నెలలో ఆమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. కరోనా గురించి అప్పుడు హైలెట్ చేసిందామె. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లో తన వీడియోలు షేర్ చేసింది. అక్టోబర్ 2020 నాటికి రాజకీయ విమర్శకురాలిగా ఆమెకు గుర్తింపు వచ్చింది. 2021 నాటికి ఆమె యూట్యూబ్ ఛానల్కు లక్ష మంది సబ్స్క్రైబర్లు వచ్చేశారు.
బీహార్ మే కాబా, యూపీ మే కా బీ, యూపీ మే కాబా సీజన్ 2, ఎంపీ మే కాబా పాటలు పాడిందామె. అవన్నీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి. 2023 జూలైలో ఆమె వివాదంలో ఇరుక్కున్నది. ఓ గిరిజన కార్మికుడిపై మూత్రం పోసిన వీడియోతో ఆమె మధ్యప్రదేశ్లోనూ పాపులరైంది. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద ప్రస్తుతం నేహ సింగ్పై కేసు బుక్ చేశారు. లక్నోలోని హజ్రత్గంజ్ పోలీసు స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు.
కాగా, పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్ నటుల సినిమాలు నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశానికి చెందిన యూట్యూబ్ ఛానళ్లపై కూడా నిషేధం విధించింది. దాదాపు 16 యూట్యూబ్ ఛానళ్లపై వేటు వేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
More Stories
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు
మావోయిస్టు అగ్రనేత హతంపై ప్రధాని, హోంమంత్రి హర్షం