
కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని నిజామాబాద్ అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఆయన ఆదివారం సందర్శించిన సందర్భంగా శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించి రైతులను పరామర్శించారు.
రైతన్నలు పండించిన వరి పంట అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో బస్తాల కొరత, హమాలీ కొరత, ట్రాన్స్ పోర్ట్ లారీల కోరత కారణంగా రైతన్నలు మండుటెండలో రోజుల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఉందని వాపోయారు. ఇందూర్ జిల్లాలో ఇప్పటివరకు కనీసం 40శాతం వడ్ల కొనుగోలు జరగలేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 బోనస్ అంతా బోగస్ అని రైతు పండించిన పది రకాల పంటలకు బోనస్ ఇస్తానని కేవలం సన్న వడ్లకే ఇచ్చి చేతులు దులుపుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు నష్టపోకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎటువంటి తరుగులు తీయకుండా, బస్తాల కోరత, హమాలీ కోరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హితబోధ చేశారు.
రైస్ మిల్లర్ల సమస్య, కొనుగోలు కేంద్రాలలో ఉన్న పలు సమస్యలపై అదనపు కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి త్వరతగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్ధిక భరోసాగా ఫసల్ భీమా యోజన అమలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే ఫసల్ భీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
More Stories
కాళేశ్వరం కమిషన్ బ్లాక్ మెయిల్ కోసమా?
తెలంగాణ రాజ్భవన్లో మార్ఫింగ్ రచ్చ
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు