
ఉగ్రవాదులను చూసిన పర్యటకులను పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో విచారిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అక్కడ వారు తీసుకున్న ఫొటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
పర్యటన సమయంలో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. పహల్గాంలోకి ప్రవేశించే, నిష్క్రమించే ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం సహాయంతో తనిఖీలను ముమ్మరం చేశామని పేర్కొన్నారు. పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపిన విషయం తెలుసుకొని తొలుత సీఆర్పీఎఫ్ సిఆర్పిఎఫ్ క్విక్ యాక్షన్ టీమ్ స్పందించింది.
25 మంది కమాండోలతో కూడిన బృందం రాళ్లు, బురద మార్గంలో దాదాపు 40-45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసి ఘటనాస్థలానికి చేరుకుంది. వెంటనే పహల్గాం చుట్టూ సీఆర్పీఎఫ్ యూనిట్ చెక్పోస్టులు, ఘటనాస్థలానికి సమీపంలో సురక్షిత పాయింట్లను ఏర్పాటు చేసింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని పర్యాటకులను ఇతర ప్రాంతాలకు తరలించారు.
More Stories
మరో పాక్ దౌత్యాధికారిపై భారత్ వేటు
5 ఏళ్ల తర్వాత 720 మందితో కైలాస మానస సరోవర యాత్ర
భారత్ లో 257 యాక్టివ్ కరోనా కేసులు