
అప్పు తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పేర్కొంటూ వెంటనే శ్రీధర్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత 18 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏ పని చేయకుండా రూ. 10 వేల కోట్ల రూపాయలు ఇచ్చారంటున్న మంత్రి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి అసెంబ్లీలో హెచ్సియూ భూముల్లో గుంట నక్కలు ఉన్నారని చెప్పారే తప్ప వారు ఎవరో చెప్పడం లేదని బిజెపి నేత విస్మయం వ్యక్తం చేశారు. సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కేవలం బట్ట గాల్చి మీద వేయడానికి బిజెపి ఎంపీ ఉన్నారని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేళ అదే నిజమైతే ఇంత వరకు ఎందుకు ఆ పేరు చెప్పలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీకి చిత్త శుద్ధి ఉంటే పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. మద్రాస్ చీకటి ఒప్పందంలో భాగంగానే రెండు పార్టీలు బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నాయని ఏలేటి ఆరోపించారు. బిజెపి చేసే పోరాటం చూసి రెండు పార్టీలు తమపై ఆరోపణ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో హెచ్సియూ కాదు ఏ భూమి అమ్మడానికి వీలులేదని స్పష్టం చేశారు. భూముల అమ్మకంపై ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడుతుందని ఏలేటి హెచ్చరించారు.
More Stories
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం
తెలంగాణకు వచ్చిన పాక్ పౌరులు వాఘా సరిహద్దు దాటాలి
కాళేశ్వరంలో డిజైన్లు, నాణ్యతలో ప్రమాణాలకు తిలోదకాలు