
ఆంధ్రప్రదేలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ విలీనం చేయబడి.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా మారతాయి. కొత్త బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అమరావతిలో ఉండనుండగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేయనున్నది.
యూపీలోని బరోడా యూపీ బ్యాంక్, ఆర్యవర్ట్ బ్యాంక్, ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంక్ ఉత్తర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో విలీనవుతాయి. ప్రధాన కార్యాలయం బ్యాంక్ ఆఫ్ బరోడా స్పాన్సర్షిప్ కింద లక్నోలో ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో, బంగియా గ్రామీణ వికాస్, పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్, ఉత్తరబంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ విలీనం చేయబడి పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్గా మారుతాయి.
ఇదే తరహాలో మిగతా ఎనిమిది రాష్ట్రాల్లోనూ ఆర్ఆర్బీలు విలీనమవుతాయి. ఆర్ఆర్బీలో కేంద్రానికి 50శాతం వాటా ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు స్పాన్సర్ వాటా 35 శాతం, రాష్ట్రాలకు 15 శాతం ఉంటుంది. సవరించిన చట్టం ప్రకారం వాటాను తగ్గించిన తర్వాత కూడా కేంద్రం, స్పాన్సర్ బ్యాంకుల వాటా 51 శాతం కంటే తక్కువ ఉండకూడదు.
బ్యాంకులకు రూ.2వేల కోట్ల మూలధనం ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం, అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ.2వేల కోట్ల అధీకృత మూలధనం ఉంటుంది. ఇదిలా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, కళాకారులకు రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఆర్ఆర్బీ యాక్ట్ కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేశారు.
ఇందులో కేంద్రానికి 50శాతం, స్పాన్సర్ బ్యాంకులకు 30శాతం, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుతం 26 రాష్ట్రంలో 43 ఆర్ఆర్బీలు ఉండగా.. ఈ సంఖ్య 28 తగ్గుతుంది.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను