
కాగా, డీఎంకే మంత్రి పొన్ముడి వివాదస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ‘మంత్రి పొన్ముడి ప్రసంగం ఆమోదయోగ్యం కాదు. ప్రసంగానికి కారణం ఏమైనప్పటికీ, అలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఖండించదగినవి’ అని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్, సింగర్ చిన్మయి శ్రీపాద తదితరులు ఘాటుగా విమర్శించారు.
డిఎంకె ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ మంత్రులలో పొన్ముడి ఒకరు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద 2023లో పొన్ముడిని, ఆయన కుమారుడు, కళ్లకురిచ్చి పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమ్నైని ఇంకా వారి కుటుంబ సభ్యులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ రూ.14 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది.
మద్రాస్ హైకోర్టు 2023లో ఆయనను దోషిగా నిర్ధారించి, నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీని ఫలితంగా ఆయన వెంటనే శాసనసభ్యుడిగా అనర్హత వేటు పడడంతో అప్పట్లో మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, మార్చ్ 2024లో సుప్రీంకోర్టు శిక్షను నిలిపివేయడంతో స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి మాటలతో పార్టీ పదవిని పోగొట్టుకున్నారు పొన్ముడి.
పొన్ముడి వ్యాఖ్యలపై బిజెపి ఐటి సెల్ కన్వీనర్ అమిత్ మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై దాడి చేసిన తర్వాత ఇపుడు హిందూ వ్యతిరేకతను నిందించే చర్యను ముందుకు తీసుకున్నారని ధ్వజమెత్తారు. పొన్ముడి ఒక వేశ్య, ఒక వ్యక్తికి సంబంధించిన అసభ్యకరమైన కథను చెప్పారని, అక్కడ అతను పవిత్ర హిందూ చిహ్నాలను అసభ్యకరమైన లైంగిక సూచనలకు తగ్గించాడని మండిపడ్డారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం