చంద్రయాన్‌-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం

చంద్రయాన్‌-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం

చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్‌-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం తెలిపినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ వి.నారాయణన్‌ తెలిపారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మేరకు వెల్లడించారు. జపాన్ సహకారంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రకటించారు.

2023లో ప్రయోగించిన చంద్రయాన్‌-3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్‌ రోవర్‌ను జాబిల్లిపైకి తీసుకెళ్లమని పేర్కొన్నారు. ఈసారి మాత్రం చంద్రయాన్‌-5 ద్వారా 250 కిలోల రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ చేస్తామన్నారు. జాబిల్లి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్‌-4 మిషన్‌ను 2027లో ప్రయోగిస్తామని వెల్లడించారు.

చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు మొదటిసారిగా 2008లో చంద్రయాన్-1 మిషన్​ను విజయవంతంగా చేపట్టారు. ఆ ప్రయోగం ద్వారా చంద్రుడిపై రసాయన, ఖనిజ, ఫొటో జియోలాజిక్ మ్యాపింగ్ చేశారు. ఇక చంద్రయాన్​-2 మిషన్​ను 2019లో చేపట్టగా, ఆ ప్రాజెక్ట్ దాదాపు విజయవంతం అయ్యింది. కానీ చివరి క్షణాల్లో విఫలమైంది. 

అయితే ఈ మిషన్​లోని ఆన్​బోర్డ్ హై రిజల్యూషన్​ కెమెరా ఇప్పటి వరకు వందలాది ఫొటోలను పంపిన్నట్లు నారాయణన్ తెలిపారు. చంద్రయాన్​-2 కొనసాగింపుగా చంద్రయాన్-3 మిషన్​ను చేపట్టారు. దీనిని చంద్రుని ఉపరితలంపై సేఫ్ ల్యాండింగ్, రోవర్ మూమెంట్​ పరీక్షల కోసం చేపట్టారు. 2023 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విజయవంతంగా దిగింది. 

చంద్రుని నుంచి సేకరించి నమూనాలను తీసుకురావడమే లక్ష్యంగా 2027లో చంద్రయాన్​-4 మిషన్​ను చేపట్టనున్నారని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు.