
హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తున్న హైడ్రాను పాతబస్తీలో అమలు చేయగలరా ? అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ను నిజామాబాద్ బిజెపి ఎంపీ డి. అర్వింద్ కుమార్ సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పాతబస్తీలో అడుగుపెట్టగలరా? అని ఆయన ప్రశ్నించారు. నిజామాబాదు లో ఎమ్యెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ హిందూ, ముస్లింలలో ఎవరి వల్ల అధికంగా ఆదాయం వస్తుందో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు.
బిఆర్ఎస్ పార్టీ భూ స్థాపితమైందని పేర్కొంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ శకం సైతం ముగిసిందని తేల్చి చెప్పారు. భారతదేశాన్ని కాషాయమయం చేయటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయటం బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా ఓటర్లకు ఆయన విజ్జప్తి చేశారు.
ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అరవింద్ ధ్వజమెత్తారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కులాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ప్రధాని మోదీనని విమర్శించే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదని ధ్వజమెత్తారు.
హామీలు తీర్చలేక రేవంత్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఎంపీ అర్వింద్ గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి కుల గణనపై చిత్తశుద్ది లేదని, అందుకే రీ సర్వే చేస్తున్నారంటూ ఆరోపించారు.
ఇక బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, అయితే ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో మలుపు కాబోతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందని స్పష్టం చేశారు.
దేశమంతా బీజేపీ గాలి వీస్తోందని లక్ష్మణ్ తెలిపారు. ఉద్యోగాలు సైతం ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఎందుకు ఓట్లెయ్యాలని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు టీచర్లకు డీఏలు, పీఆర్సీలు ఇవ్వలేదని, అలాంటి వారు ఓట్లు ఎలా అడుగుతారంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి టైం పాస్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ కుల రాజకీయలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులగణనతో బీసీల పొట్టగొడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ముస్లింల కోసమే ఈ కుల గణన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశమంతా బీజేపీ గాలి వీస్తోందని లక్ష్మణ్ తెలిపారు. ఉద్యోగాలు సైతం ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఎందుకు ఓట్లెయ్యాలని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు టీచర్లకు డీఏలు, పీఆర్సీలు ఇవ్వలేదని, అలాంటి వారు ఓట్లు ఎలా అడుగుతారంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి టైం పాస్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ కుల రాజకీయలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులగణనతో బీసీల పొట్టగొడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ముస్లింల కోసమే ఈ కుల గణన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Stories
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!
యూట్యూబర్ సన్నీ యాదవ్ కు పోలీసులు లుక్ఔట్ నోలీసులు
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!