
అయితే ‘భారతీయ మార్కెట్లలో ప్రవేశించడానికి అసమంజసంగా ఉన్న అధిక సుంకాలు మాకు ప్రధాన సమస్యగా ఉన్నాయి. నిజానికి ఇది పెద్ద సమస్య’ అని ట్రంప్ విలేకరుల ప్రశ్నలకు బదులుగా స్పష్టం చేశారు. సుంకాల విషయంలో రెండు దేశాల మధ్య స్పష్టత రాకపోవడం గమనార్హం.
‘అనేక వస్తువులపై భారత్ 30, 40, 60….70 శాతం సుంకం కూడా విధిస్తోందని నేను చెప్పాల్సి ఉంది. కొన్నింటి విషయంలో సుంకాలు అంతకంటే ఎక్కువగా కూడా ఉన్నాయి. ఉదాహరణకు భారత్కు వెళుతున్న అమెరికా కార్లపై 70 శాతం సుంకం విధిస్తున్నారు. దీంతో వాటిని అక్కడ విక్రయించడం అసంభవం అవుతోందని ట్రంప్ తెలిపారు.
‘‘అది ఇండియా కానివ్వండి, మరే దేశమైనా కానివ్వండి.. మా ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తే మేమూ అలాగే విధిస్తాం. భారత్ ఎలా వసూలు చేస్తే.. మేమూ అలాగే వసూలు చేస్తాం’’ అని తేల్చి చెప్పారు.
కాకపోతే.. భారతదేశంతో పోలిస్తే చైనా, యూరోపియన్ యూనియన్తో వాణిజ్యసంబంధాలు చాలా క్లిష్టంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భారత్తో తన తొలి హయాంలో జరిపిన చర్చల వల్ల సుంకాలు తగ్గలేదని.. అందుకే ఈసారి పరస్పర సుంకాల విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మోదీతో భేటీ కావడానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ పరస్పర సుంకాలకు సంబంధించిన ఉత్తర్వుపై సంతకం చేశారు.
కాగా, మునుపెన్నడూ లేని విధంగా.. ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా కలిసి పనిచేస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్, అమెరికా దేశాలు కలిసికట్టుగా వ్యవహరిస్తాయని మోడీ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే పటిష్ట చర్యలు అవసరమని తాము అభిప్రాయపడ్డామని అన్నారు.
భారత్-చైనా సరిహద్దులో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని, అవి ఆగిపోవాల్సిన అవసరం ఉన్నదని మోదీ స్పష్టం చేశారు. ‘మాకు చైనాతో మంచి సంబంధాలు ఉంటాయని అనుకుంటున్నాను. కోవిడ్ వచ్చే వరకూ దేశాధ్యక్షుడు క్సితో బాగానే సంబంధాలు నెరిపాను. అప్పటి వరకూ మేము బాగా సన్నిహితంగా గడిపాం. ప్రపంచంలో చైనా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోందని నేను విశ్వసిస్తున్నాను. ఉక్రెయిన్, రష్యా యుద్ధ నివారణకు వారు కృషి చేసి ఉండవచ్చు’ అని తెలిపారు.
“భారత్-చైనా సరిహద్దులో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అవి కొనసాగుతూనే ఉన్నాయని అనుకుంటున్నా. ఈ విషయంలో నేనేమైనా చేయగలిగేది ఉంటే చేస్తా. ఎందుకంటే ఘర్షణలు ఆగిపోవాలి. అవి చాలా కాలం నుండి కొనసాగుతున్నాయి. హింస జరుగుతోంది. చైనా, రష్యా, భారత్…మేమందరం కలిసి ముందుకు సాగగలం. అది చాలా ముఖ్యం’ అని మోదీ వివరించారు.
More Stories
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!
ముస్లిం రేజర్వేషన్లపై డికె వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం
ఓ ముస్లిం యువతితో మాట్లాడిన హిందూ యువకుడిపై దాడి!