
ఆధార్ కార్డు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది ప్రతి భారత పౌరుని ప్రత్యేకంగా గుర్తించే 12 అంకెల ఒక ఐడీ నంబర్ అందిస్తుంది. ఆధార్ కార్డులో పౌరుల పేర్లు చిరునామాలు, వయస్సు, మొబైల్ నంబర్ వేలిముద్రలు వంటి ముఖ్యమైన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఈ పత్రం భారతీయుల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది.
ప్రస్తుతం, భారతదేశంలో ప్రభుత్వం ఆధార్ కార్డును ఒక కీలక గుర్తింపుగా పరిగణిస్తుంది. కానీ,ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ కంపెనీలు కూడా ఆధార్ వివరాలను యాక్సెస్ చేయగలవు. అంటే ప్రైవేట్ సంస్థలు ఆధార్ ఆధారిత సేవలను ఉపయోగించడానికి ఆధార్ వివరాలను ప్రభుత్వానికి అనుమతి తీసుకుని పొందవచ్చు.
ఈ నిర్ణయం ప్రకారం, ప్రైవేట్ కంపెనీలు ఆధార్ వివరాలను యాక్సెస్ చేసేటప్పుడు, వారికి కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముందుగా వారు కేంద్ర ప్రభుత్వానికి లేదా యూఐడీఏఐకి ఆధార్ వినియోగానికి అనుమతి తీసుకోవాలి. వారు ఆధార్ వివరాలను అవసరమైన కారణంతో మాత్రమే అడగాలి అదే సమయంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా అవి ఉపయోగించబడతాయి.
అయితే ఈ కొత్త ప్రకటనతో పాటు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడే పద్ధతులపై కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఆధార్ లోని వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటి సమాచారాన్ని వినియోగించడం వల్ల కొంతమంది మోసాలకు గురైన ఘటనలు కూడా జరిగాయి. మరింతగా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఆధార్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతించాయి.
అయితే ఈ కొత్త నిర్ణయం ప్రకారం ప్రైవేట్ సంస్థలు ఈ సమాచారాన్ని ప్రామాణీకరణ కోసం ఉపయోగించడానికి అనుమతించబడ్డాయి. ఈ నిర్ణయం వల్ల ప్రజలు వారి వ్యక్తిగత సమాచార రక్షణ గురించి ఆందోళన చెందుతున్నారు కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి, దీనికి సుప్రీంకోర్టు ముందుగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
More Stories
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం
మణిపూర్లో తెగల మధ్య ఘర్షణలో ఒకరు మృతి