
న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. సమాజమే మారాలని, ఇందులో కోర్టులు ఏం చేయలేమని బెంచ్ స్పష్టం చేసింది.
పెండ్లి సమయంలో ఇచ్చే బహుమతులు, వస్తువులు, నగదుకు సంబంధించిన జాబితాను తయారుచేసి వాటిని అఫిడవిట్ రూపంలో రికార్డు చేసి వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో జత చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా పిటిషనర్ కోరారు. వరకట్న నిషేధ చట్టం, ఐపీసీలోని 498ఎ సెక్షన్ వరకట్న కోరికలు, వేధింపుల నుంచి వివాహిత మహిళకు రక్షణ కల్పిస్తాయి.
అయితే ఈ చట్టాలు భార్యభర్తల మధ్య వేరే విషయంలో మనస్పర్థలు తలెత్తినపుడు భర్త కుటుంబంపై కక్షసాధించేందుకు ఈ చట్టాలను ఆయుధంగా మలచుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ చట్టాల కింద పళ్లైన మగవారిపై కొన్నిసార్లు తప్పుడు కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. వరకట్నం కేసుల్లో చాలా మంది పురుషులపై తప్పుడు అభియోగాలు నమోదవుతున్నాయని, ఇవి విషాదాంత పరిస్థితులకు దారి తీస్తున్నాయని పిటిషనర్ తెలిపారు. ఇది మన న్యాయ, క్రిమినల్ దర్యాప్తు విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఆయన తెలిపారు.
వరకట్నం, గృహ హింస చట్టాల దుర్వినియోగం కారణంగా ఆ చట్టాలను రూపొందించడం వెనుక గల గొప్ప ఉద్దేశాలు ఓడిపోతున్నాయని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా అమాయక వ్యక్తుల ప్రాణాలను కాపాడవచ్చని.. చట్టం ఉద్దేశం సైతం నెరవేరుతుందని పిటిషనర్ పేర్కొన్నారు.
More Stories
భారత్కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!