జీహెచ్ఎంసి లో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు మంతనాలు జరుగుతున్నాయి. దానితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ఆసక్తిదాయకంగా మారాయి. ఓ వైపు నగర మేయర్పై అవిశ్వాసంపై బీఆర్ఎ స్ నాయకులు చర్చించకుంటుండగా, మరో వైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిజంగా మేయర్పై అవిశ్వాసం పెడితే మేము బేషరతుగా అవిశ్వాసానికి మద్దతిస్తామంటూ బీజెపికి చెందిన కొందరు కార్పొరేటర్లు ప్రకటించారు.
ఇంకోవైపు అవిశ్వాసం పెడితే ఓడుతారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, నగరంలో కీలక రాజకీయనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో బిఆర్ఎస్ నేతల విందు సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, నగరంలోని పార్టీ ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ెచ్ఎంసి మేయర్పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి గల అవకాశాలపై చర్చించినట్లు తెలిసింది.
మేయర్ బాధ్యతలు చేపట్టి వచ్చే ఫిబ్రవరి 10 నాటికి నాలుగేళ్లు పూర్తి కావడం, దానితో అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో ఈ చర్చలకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. పైగా, మేయర్ ఎన్నికలో ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీ, ఎంపీలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి మేయర్పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి గల అవకాశాలపై చర్చించినట్లు తెలిసింది.
ప్రస్తుతం అవిశ్వాసం పెడితే ఎవరి బలమెంత? ఎవరు ఏమి చేశారనేది నగర ప్రజలకు తెలుస్తుందని, తద్వారా పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు వచ్చే అవకాశాలుంటాయని, వాటన్నింటిని రానున్న ఎన్నికల్లో ప్రజల ముందుకు తీసుకెళ్ళొచ్చని పార్టీ నేతలు అభిప్రాయ పడినట్లు తెలిసింది. కాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని తాము పలుమార్లు ప్రజలకు వివరిస్తూ వస్తున్నామని, ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తాము కాంగ్రెస్కు వ్యతిరేకమని చెప్పాలంటే మేయర్పై అవిశ్వా స తీర్మానం ప్రవేశపెట్టాలని బిజెపి కార్పొరేటర్ శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
కాంగ్రె స్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పనిచేస్తాయనే దానికి మేయర్ అవిశ్వాస తీర్మానంతో తేటతెల్లమవుతుందనీ, ప్రజలకు ఎవరెవరు ఏ మేరకు నిజాయితీగా వ్యవహరిస్తారో ఈ తీర్మానంతో వెల్లడవుతుందని శ్రావణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసిలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు.
గత ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ పార్టీ నేత డా. కేశవరావు కుమార్తే గద్వాల్ విజయలక్ష్మిని అనూహ్యంగా రంగంలోకి తీసుకొచ్చి మేయర్ గా చేశారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఆమె తన తండ్రితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే, బీఆర్ఎస్, బీజెపిల నుంచి పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి చేరారు. అయితే, అవిశ్వాసం తీర్మానం విషయం ప్రచారంలోకి రాగానే పలువురు పార్టీ మారిన వారు జిహెచ్ఎంసి చట్టం తెలిసిన వారిని సంప్రదిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ఎలా జరుగుతుందనేది వాకబు చేస్తున్నారు.
అయితే, ఓటు హక్కు గల సభ్యులలో మూడోవంతు మద్దతు ఇస్తే త్ అవిశ్వాస తీర్మానం నెగ్గదు. దానితో ిజెపి, ఎంఐఎం లలో ఎవ్వరో ఒకరు మద్దతు ఇస్తే తప్ప అవిశ్వాస తీర్మానం నెగ్గదు. ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్ తో సఖ్యతతో ఉంటున్నది. వచ్చే ఏడాది ఎన్నికలలో జిహెచ్ఎంసి లో పాగా వేయాలి అనుకొంటున్న బిజెపి ఏమేరకు బిఆర్ఎస్ తో ఈ విషయంలో చేతులు కలుపుతుందో చూడాల్సి ఉంది.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!