
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత థానేలో నిందితుడు విజయ్ దాస్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. అతని అసలు పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్. ఇక్కడి వాడు కాదని, అతడు బంగ్లాదేశ్ వాసి అని పోలీసులు తెలిపారు.
అతడి వయసు 30 సంవత్సరాలు అని, 6 నెలలుగా ముంబైలో ఉంటున్నాడని పేర్కొన్నారు. ‘షరీఫుల్ ఇస్లాం భారత్లోకి అక్రమంగా చొరబడ్డాడు. అందుకే పేరు మార్చుకున్నాడు. విజయ్ దాస్ అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్నాడు. హౌజ్ కీపింగ్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. సైఫ్ ఇంటికి దొంగతనం కోసం వెళ్లాడు. అతడ్ని త్వరలో కోర్టులో ప్రవేశపెడతాం’ అని ముంబై డీసీపీ స్పష్టం చేశారు.
ఆదివారం తెల్లవారుజామున థానేలోని హరినందాని ఎస్టేట్ సమీపంలోని మెట్రో నిర్మాణం చేస్తున్న కార్మికు క్యాంపులో అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ముంబై డీసీపీ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహిస్తామని, ఈ సందర్భంగా నిందిడిని పెడతామని తెలిపారు.
కాగా, శనివారం ఛత్తీస్గఢ్లో అరెస్టు చేసిన అనుమానితుడు కైలాశ్ నిందితుడు కాదని పేర్కొన్నారు. షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో ప్రయాణిస్తుండగా దుర్గ్ ఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకొని ముంబయి పోలీసులు ఆర్పీఎఫ్ పోలీసులకు పంపారు.
కాగా, సైఫ్ నివాసంలో చొరబడి అతనిపై దాడి చేసింది తాననేని అంగీకరించాడని ముంబై పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని బాంద్రాకు తరలిస్తున్నామని, అనంతరం విచారిస్తామని చెప్పారు. ఆదివారం ఉదయం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరుతామని వెల్లడించారు. అతనివద్ద భారతీయుడిగా ఉన్న ధృవీకరణ పత్రం నకిలీదని వెల్లడించారు. దీంతో అతడు భారతీయుడా లేదా బంగ్లాదేశీయా అని ఆరాతీస్తున్నారు.
నగలు ముట్టుకోలేదు
మరోవంక, సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ శనివారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ రోజు నిందితుడు చాలా దూకుడుగా ఉన్నాడని, అయితే అక్కడ నగలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని అతడు ముట్టుకోలేదని ఆమె తెలిపారు. మరోవైపు ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించ లేదు. అయితే దాడికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
సైఫ్ మెడికల్ బిల్లు ఇప్పటివరకు సుమారు రూ. 40 లక్షలు అయ్యింది. అందులో రూ. 25 లక్షల క్లెయిమ్ను ఆమోదించినట్టు వైద్య ఆరోగ్య బీమా సంస్థ నివా బుపా తెలిపింది.
More Stories
ఖతార్ అధినేతకు స్వయంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి మోదీ స్వాగతం!
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్
రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కుత్రిమ మేధ