
ఈ సందర్భంగా జనవరి 25న జరుపుకునే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ రిపబ్లిక్ డే చాలా ప్రత్యేకమైందని చెబుతూ ఈ సంవత్సరం భారత రాజ్యాం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని తెలిపారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ పరిషత్లోని గొప్ప వ్యక్తులకు తలవంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునీకరించి, పటిష్ఠం చేస్తుందని ప్రధాని తెలిపారు. ప్రజాశక్తిని బలోపేతం చేయడానికి సాంకేతికతను ఉపయోగిస్తూ నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తుందని కొనియాడారు. అలాగే, అయోధ్య రామమందిరం వార్షికోత్సవంపై వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ నెల చివరి ఆదివారం రోజున రిపబ్లిక్ డే నేపథ్యంలో మూడో ఆదివారం రోజున మన్ కీ బాత్ 118వ ఎపిసోడ్ ప్రసారమైంది.
More Stories
ఖతార్ అధినేతకు స్వయంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి మోదీ స్వాగతం!
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్
రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కుత్రిమ మేధ