
నూతన సంవత్సర కానుకగా మేడ్చల్, శామీర్ పేట్లకు మెట్రో పొడగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి డీపీఆర్ను సిద్ధం చేయవలసిందిగా సీఎం ఆదేశించినట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్యారడైజ్- మేడ్చల్(23 కిలోమీటర్లు), జేబీఎస్- శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు డీపీఆర్ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించవలసిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. కొత్త కారిడార్ లో ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి తాడ్బన్డ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్కు దాదాపు 23 కిలోమీటర్ల ఉంటుంది. అదే విధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకింపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్ పేట్ కు 22 కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరిస్తారు.
గత మల్కాజ్ గిరి ఎంపీగా ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్ల రూట్ మ్యాప్లపై తనకు మంచి అవగాహన ఉందని, అయినా రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను కూడా తీసుకోవలసిందిగా మెట్రో ఎండీని ముఖ్యమంత్రి ఆదేశించారు.
డీపీఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం సూచించారు. మెట్రో ఫేజ్-2 ‘ఏ’ భాగం లాగే ‘బి’ భాగాన్ని కూడా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
More Stories
హెచ్సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్