ప్రపంచ నాగరికత కోసం సనాతన ధర్మాన్ని గౌరవించాలి

ప్రపంచ నాగరికత కోసం సనాతన ధర్మాన్ని గౌరవించాలి
ప్రపంచ నాగరికతను కాపాడుకోవడానికి సనాతన ధర్మాన్ని గౌరవించాల్సిందే అని  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అయోధ్యలోని అసర్ఫీ భవన్ పీఠ్ వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారతదేశ ఋషులు “వసుధైవ కుటుంబకం” – మొత్తం ప్రపంచంలో ఒకే కుటుంబం అని వర్ణిస్తూ పురాతన జ్ఞానం గురించి మాట్లాడారని సిఎం యోగి గుర్తు చేశారు.
 
ముఖ్యంగా సంక్షోభంలో నివసిస్తున్న హిందువులకు స్వర్గధామాన్ని అందించడం ద్వారా ఈ మతం ఎల్లప్పుడూ ఇతర మతాలు, వర్గాల పట్ల కరుణతో ఉందని కూడా ఆయన తెలిపారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న హిందువులకు అలాంటి గౌరవం ఎందుకు ఇవ్వలేదని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నను లేవనెత్తారు.

పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువులపై అకృత్యాలు జరుగుతున్నాయని, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేస్తున్నారని చెబుతూ హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది నిదర్శనమని తెలిపారు.

కాశీ, అయోధ్య, సంబల్, భోజ్ పూర్ లలో హిందూ ఆలయాలపై తరచూ దాడులు, అపవిత్రం చేసిన ఘటనలు ఉన్నాయని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సామరస్యం పరిడవిల్లాలంటే సనాతన ధర్మం ప్రాధాన్యతను నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.
కాశీ, అయోధ్య, సంభాల్, భోజ్‌పూర్ వంటి హిందువుల దేవాలయాలపై చరిత్రలో పదేపదే దాడి చేసి అపవిత్రం చేశారని గుర్తు చేశారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పిల్లలను కూడా యోగి ఆదిత్యనాథ్ కన్నీటి పర్యంతమయ్యారు. కోల్‌కతా సమీపంలో రిక్షా నడుపుతున్న ఔరంగజేబు కుటుంబ సభ్యుడి గురించి జరిగిన ఒక సంఘటనను ఆయన వివరించారు.
 
‘ఔరంగజేబు వారసులు కోల్‌కతా సమీపంలో నివసిస్తున్నారని, ఆటో కార్మికులుగా జీవనోపాధి పొందుతున్నారని కొందరు నాకు చెప్పారు. దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలపై విధ్వంసక చర్యలకు ఔరంగజేబు పాల్పడ్డాడు. దైవత్వాన్ని ధిక్కరించకపోతే అతడి వారసులు అటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఉండకపోవచ్చు’ అని  ఆయన తెలిపారు. 
 
చరిత్ర అంతటా మత సహనం, మతపరమైన మైనారిటీల పట్ల వ్యవహరించిన ఘటనలను ప్రస్తావిస్తూ ప్రపంచంలో శాంతి, ఐక్యత పెంపొందించాలంటే సనాతన ధర్మమే మార్గమని స్పష్టం చేశారు.