ఈ ఘటన గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. విగ్రహ ధ్వంసం ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముత్యాలమ్మ ఆలయంపై దాడిని నిరసిస్తూ హిందూ సంఘాలు శనివారం నిరసన చేపట్టాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టాయి. సికింద్రాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతల నెలకొనడంతో పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం.
“సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందూ సోదరులపై అన్యాయంగా లాఠీఛార్జ్ చేశారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మతపరమైన మనోభావాలపై దాడి జరిగినప్పుడు, విగ్రహాలను అపవిత్రం చేసినప్పుడు శాంతియుతంగా నిరసన చేయడానికి కూడా అనుమతించకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది” అంటూ బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ లాఠీ ఛార్జీకి ఎవరు ఆదేశించారు? అని ప్రశ్నించారు. ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తప్పా న్యాయం కోరే భక్తులపై కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఇది స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొంటూ మెజారిటీ ఆందోళనలను ఎప్పుడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. “మా విశ్వాసంపై జరిగిన ఈ దాడికి మేము జవాబుదారీతనం, న్యాయాన్ని కోరుతున్నాము” అని స్పష్టం చేశారు.

More Stories
భారత్ కు 10 బిలియన్ డాలర్ల జపాన్ పెట్టుబడులు
పాక్ లో 125 ఏళ్ల నాటి సిక్కు గురుద్వారా కూల్చివేత.. భారత్ ఆగ్రహం
జూన్లో అతి తక్కువ వర్షపాతంతో వ్యవసాయంకు ముప్పు