
ఇదే విషయాన్ని ప్రధాని మోదీ అక్టోబర్ 5న మహారాష్ట్రలో జరిగిన ఓ బహిరంగ సభలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, మాఫీ కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారంటూ వాస్తవాలను వివరించారని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు మహారాష్ట్ర రైతులను ప్రభావితం చేస్తాయని, తద్వారా ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని దెబ్బతీస్తాయని అధిష్ఠానం చెప్పడంతో, వారి ఆదేశాలతోనే రుణమాఫీ విషయంలో అబద్ధాలను రంగరిస్తూ ప్రధాని మోదీకి రేవంత్ లేఖ రాశారని ఆయన ఆరోపించారు.
మాఫీ చేశామని మీరు చెప్పడం తెలంగాణ ప్రజలనే కాకుండా దేశ ప్రజలను సైతం తప్పుదోవ పట్టించడం.. మోసం చేయడం కాదా? అంటూ ప్రశ్నించారు. బహిరంగ చర్చ వద్దనుకుంటే రుణమాఫీతోపాటు కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చిన ఇతర హామీలపైనా చర్చించేందుకు తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎంకు మహేశ్వర్ రెడ్డి సంధించిన ప్రశ్నలు ఇవే
1. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2లక్షలలోపు పంట రుణాలు ఒకే దఫాలో మాఫీ చేస్తామని టీపీసీసీ చీఫ్గా మీరు(రేవంత్ రెడ్డి) అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వలేదా?, ప్రస్తుతం సగం మంది రైతులకు మాఫీ కాని మాట వాస్తవం కాదా?
2. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2023 డిసెంబరు 09న అర్హులైన రైతులందరికీ మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ హామీ ఇచ్చారు కదా? మరిప్పుడు పది నెలలైనా ఆ హామీ పూర్తిగా అమలు కాలేదన్నది వాస్తవం కాదా?
3. రూ.2లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేసేందుకు రూ.49,500కోట్లు అవసరం అవుతాయని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ(ఎస్ఎల్బీసీ) మొదట్లోనే చెప్పిన మాట నిజం కాదా?
4. ఆ తర్వాత పంట రుణమాఫీకి రూ.40వేల కోట్లు ఖర్చవుతాయని 2024 మే ఒకటిన గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడింది నిజం కాదా?
5. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా 2024 ఆగస్టు 15 కల్లా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మీరు దేవళ్లపై ఒట్లు వేసింది వాస్తవం కాదా?
6. తర్వాత జరిగిన క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీకి రూ.31వేల కోట్లు అవసరమని నిర్ణయించింది నిజం కాదా?
7. కానీ, తీరా రాష్ట్ర బడ్జెట్లో రుణమాఫీ పథకానికి మీరు కేటాయించింది కేవలం రూ.26వేల కోట్లు మాత్రమే. అదీ వాస్తవం కాదా?
8. 2024 జులై 18నుంచి ఆగస్టు 15వరకు కేవలం 22.22లక్షల మంది అన్నదాతలకు రూ.17.869 కోట్లు మాత్రమే మాఫీ చేసిన మాట నిజం కాదా? ఇది మొత్తం రుణమాఫీ చేయాల్సిన నిధుల్లో సగం కంటే తక్కువ కాదా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!