బీజేపీ ఏం చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుందన్న ఆయన, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుందని ప్రశ్నించిన ఏలేటి, అంత అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. పూర్తి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్తారని ఏలేటి నిలదీశారు. రైతులందరికి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? అని బీజేపీ శాసనసభాపక్ష నేత సీఎంను ఉద్దేశించి సవాల్ విసిరారు. రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
పెట్టుబడి సహాయాన్ని రుణమాఫీకి ఉపయోగించారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసా ఎందుకివ్వడంలేదని ఎప్పటిలోపు ఇస్తారని ప్రశ్నించారు. రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ తక్షణమే ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించాలని డిమాండ్ చేయసారు.
నివేదికపై చర్చించి రైతు భరోసా స్కీమ్ గైడ్లైన్స్ను ఖరారు చేసేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు భరోసా ఖరీఫ్ సీజను డబ్బులను ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. వరంగల్లో రుణమాఫీ కృతజ్ఞత సభ పెట్టండి.. రైతులే మిమ్మల్ని ఏమని ప్రశ్నిస్తారో చూడాలని ఎద్దేవా చేశారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందంటే, అందరికీ రుణమాఫీ కాలేదని ఒప్పుకుంటున్నట్లే కదా? అని నిలదీశారు. మీరు చెప్పిన గ్రామానికే వెళ్లి, ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యిందో వారినే నేరుగా అడుగుదామని, ఇందుకోసం మీరు వస్తారా? మీ వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా? రండి అని సీఎంకు ఏలేటి సవాలు విసిరారు.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!