2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక అప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీచేస్తారని ప్రచారం జరిగింది. అమెకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో అదంతా ఒట్టి ప్రచారమేనని తేలిపోయింది. తర్వాత 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు.
విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినంటూ పేర్కొన్నారు కూడా. కానీ, తర్వాత ఆ మాటలను వెనక్కి తీసుకున్న ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. రాయబరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ రాజ్యసభ నామినేట్ కావడంతో ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ దాదాపు ఖరారయ్యిందనే ప్రచారం జోరుగా సాగింది. రాయబరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలుస్తారని మీడియా కథనాలు వెలువడ్డాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకోవాలని తోబుట్టువులను కోరారని, ఇద్దరూ పోటీ చేయాలని ఆయన కోరుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ అక్కడ రాహుల్ పోటీచేసి విజయం సాధించారు. అయితే కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ వయనాడ్ను అట్టిపెట్టుకుని రాయ్బరేలి స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రచారమూ జరిగింది. అయితే ఇప్పుడు వయనాడ్పూ ఆయన వదిలిపెడతారని చర్చ జరుగుతున్నది. జాతీయ రాజకీయాల్లో యూపీ ఉన్న ప్రాధాన్యత కారణంగా రాయబరేలీతో కలిసి వెళ్లడం దాదాపు ఖాయమని వర్గాలు తెలిపాయి.
More Stories
బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు
ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్లు గెలవాలి
‘జాతీయ ఆరోగ్య మిషన్’ మరో ఐదేళ్లు పొడిగింపు