
తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారం కోసం గురుకుల టీచర్ అభ్యర్థులు, నర్సింగ్ స్టాఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనల బాట పట్టారు. గత కొంతకాలంగా గురుకుల ఉద్యోగాలలో అవకతవకలు జరిగాయని, తాము గురుకుల బోర్డు కారణంగా నష్టపోయామని తమకు అపాయింట్మెంట్లు ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు.
గురుకుల టీచర్లు కూడా గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు పదోన్నతులు చేపట్టిన తర్వాతే కొత్తవారికి పోస్టింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకుల టీచర్ అభ్యర్థులు తమ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు.
తమకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకుల అభ్యర్థులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న గురుకుల అభ్యర్థులు.. బోర్డు చేసిన తప్పులను తమపై రుద్దొద్దని, తమకు న్యాయం చేయాలని కోరారు.
సరైన పద్దతిలో నియామక ప్రక్రియ జరుగకపోవడంతోనే ఒక్కొక్కరికి మూడు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. తద్వారా చాలా మంది నష్టపోయారని తెలిపారు. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు.
ఇప్పటికైనా నియామకాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దణ్ణం పెడుతూ వేడుకున్నారు.
తాము కూడా కోర్టుకు వెళ్లామని, న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఇన్నాళ్లు ఎన్నికల కోడ్ అని సాగదీశారని, ఇప్పుడు స్కూళ్లు కూడా ప్రారంభమవుతున్నాయని తమకు ఇంకెప్పుడు న్యాయం చేస్తారంటూ నిరసన వ్యక్తంచేశారు.
More Stories
రాయలసీమ లిఫ్ట్కు పర్యావరణ అనుమతి నిరాకరణ
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
తెలంగాణ కులగణన విశ్లేషణలో ఫ్రాన్స్ ఆర్థికవేత్త?