
ఈ కేసులో మేధా పాట్కర్ను దోషిగా తేలుస్తూ మే 24న సంచలన తీర్పు వెలువరించింది. అయితే శిక్షపై మే 30 వరకు వాదనలు విన్నది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం శిక్ష ఖరారును మాత్రం జూలై 1కి రిజర్వ్ చేసింది. కాగా పాట్కర్, సక్సేనా మధ్య 2000 సంవత్సరం నుంచి చట్టసంబంధ పోరాటం కొనసాగుతూ వస్తున్నది.
నర్మదా బచావో ఆందోళన్కు వ్యతిరేకంగా, తనకు వ్యతిరేకంగా వీకే సక్సేనా ప్రచార ప్రకటనలు ఇచ్చారని 2000 సంవత్సరంలో మేధాపాట్కర్ దావా వేయడంతో వారి మధ్య వివాదం మొదలైంది. సక్సేనా అప్పుడు అహ్మదాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు అధిపతిగా ఉన్నారు.
మేధాపాట్కర్ దావా నేపథ్యంలో వీకే సక్సేనా ఆమెపై రెండు దావాలు వేశారు. మేధా పాట్కర్ తన గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఒక దావా, టీవీ ఛానెల్లో తన పరువుకు నష్టం కలిగించే ప్రకటన ఇచ్చారని మరో దావా వేశారు. ఈ నేపథ్యంలో పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ను ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఈ నెల 24న దోషిగా ప్రకటించింది. ఇవాళ శిక్షను జూలై 1కి రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
ముస్లిం రేజర్వేషన్లపై డికె వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం