* ఉత్తరప్రదేశ్లో రెండు రోజుల్లో 166 మంది మృతి
దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్పైగా నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక వందలాది మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
రాజస్థాన్తోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో ఎండలను తట్టుకోలేక వడదెబ్బ బారిన పడి వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. అయితే జనాన్ని కాపాడేందుకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

More Stories
భారత్ రావాలంటే హసీనాను అప్పగించాలి.. బంగ్లా ప్రధాని షరతు!
నియోజకవర్గాల పునర్విభజనకు డీఎంకే మద్దతు?
ఢిల్లీలోని జార్ఖండ్ భవన్ ఎదుట ఎబివిపి నిరసన