రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఆరో విడత ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతితో పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ఉప రాష్ట్రపతి ధన్కర్, కేంద్ర మంత్రులు ఎస్.జయశంకర్, హర్దీప్ సింగ్ పురి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రి అతిశీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్,కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఓటేశారు.
పోలింగ్ బూత్లో తొలి పురుష ఓటర్గా ఓటు హక్కును వినియోగించినందుకు అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ను మంత్రి జయశంకర్ షేర్ చేశారు. ఎన్నికల సందర్భంగా బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. జర్గ్రామ్ బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై రాళ్ల దాడి చేయడంతో ఆయన భయంతో పరుగులు తీశారు.
కాగా, ఈవీఎం మొరాయించిందని సీపీఐ(ఎం) నేత బృందా కారత్, తమవారిని అడ్డుకోవడంపై మెహబూ బా ముఫ్తీ నిరసన తెలిపారు. ఆరో విడత పోలింగ్ ముగియడంతో ఇంకా మిగిలిన 57 లోక్సభ స్థానాలకు ఏడో విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న పోలింగ్ జరుగుతుంది. దీంతో ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు
More Stories
జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు
పాఠ్యపుస్తకాల్లో ద్వేషం, హింసకి తావులేదు
ఢిల్లీలో నీటి సంక్షోభంపై బిజెపి నిరసనలు