![](https://nijamtoday.com/wp-content/uploads/2024/05/Kohli-1.webp)
భారత్ స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో తన రెస్టారెంట్ బ్రాంచ్ ఓపెన్ చేశాడు. విరాట్ కోహ్లి వన్8 కమ్యూన్ పేరుతో ఇప్పటికే బెంగళూర్,ముంబై,పూణె, కోల్ కత్తా నగరాల్లో ఈ రెస్టారెంట్ లను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే అయన.. హైదరాబాద్ లో కూడా వన్ 8 కమ్యూన్ బ్రాంచ్ ప్రారంభించారు.
హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని ఆర్ఎంజెడ్ థీ లాఫ్ట్ లో ఈ రెస్టారెంట్ ను కోహ్లీ శుక్రవారం ప్రారంభించారు.ఇదే విషయాన్ని విరాట్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశాడు. ” మేము ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీకి వచ్చేశాం.నాకు వన్ 8 కమ్యూన్ అంటే అది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు. అది హైదరాబాద్ ప్రజలందర్నీ ఒకే చోట చేర్చి వారికి నచ్చిన ఆహారం అందించడం మా ఉద్దేశం ” అని విరాట్ కోహ్లి పేర్కొన్నారు.
వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులు కూడా అందుబాటులో ఉండనున్నాయి. వేడుకకు ఆర్సీబీ ఆటగాళ్లు వచ్చి సందడి చేశారు.
More Stories
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై హైకోర్టుకు కేసీఆర్
హైదరాబాద్లో ప్రముఖ స్వచ్ఛంద సంస్థలో ఈడీ సోదాలు
ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ రాజ్యాంగం గురించి మాట్లాడటమా!