![](https://nijamtoday.com/wp-content/uploads/2024/05/Pak-terror-1024x576.webp)
అదే జిల్లాలోని సీమాన్ ప్రాంతంలో భద్రతా పోస్ట్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో మరో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరణించిన భద్రతా సిబ్బంది మృతదేహాలను, క్షతగాత్రులను బన్నూలోని జాయింట్ మిలిటరీ దవాఖానకు విమానంలో తరలించారు. దాడుల అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని సెర్చింగ్ చేస్తున్నాయి.
మే 8వ తేదీ రాత్రి ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని తహసీల్ షెవాలో ప్రైవేట్ బాలికల పాఠశాలను గుర్తు తెలియని వ్యక్తులు పేల్చివేసిన తర్వాత ఈ రెండు దాడులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు తొలుత వాచ్మెన్ను చిత్రహింసలకు గురిచేసి, ఆ తర్వాత పాఠశాలలోని రెండు గదులను పేల్చివేశారన్నారు. గత ఏడాది మేలో మిరాలీలోని రెండు ప్రభుత్వ బాలికల పాఠశాలలను పేల్చివేసినప్పుడు కూడా ఇలాంటి దాడులే జరిగాయి.
More Stories
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్
ఆసియాకప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత్, శ్రీలంక
కమలా హరిస్కు ఒబామా దంపతుల మద్దతు