కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేరిట సోషల్ మీడియాలో అరుణ్ రెడ్డి యాక్టివ్గా ఉన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్తగానూ ఆయన పనిచేస్తున్నారు. అతనిపై ఐపీసీలోని 120బీ (నేరపూరిత కుట్ర) కింద కేసు బుక్ చేశారు.
పాటియాలా కోర్టు జడ్జి నివాసంలో నిన్న రాత్రి అరుణ్ను ఢిల్లీ పోలీసులు హాజరు పరిచారు. అరుణ్ రెడ్డిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి జడ్జి ఇచ్చారు. అరుణ్ రెడ్డిని అమిత్ షా ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో అరుణ్ రెడ్డి ఫోన్లను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు.
కాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన వీడియో మార్ఫింగ్కు పాల్పడి వైరల్ చేశారనే ఆరోపణల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోరాదని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీపీసీసీ సోషల్ మీడియా విభాగానికి చెందిన మన్నె సతీశ్తో పాటు ఆస్మా తస్లీం, అంబాల శివకుమార్, నవీన్, కోయ గీత, పెండ్యాల వంశీకృష్ణలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరంతా శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు.
ఇప్పటికే‘ఫేక్ వీడియోకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు రని.. తిరిగి అవే ఆరోపణలపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి మాకు నోటీసు జారీ చేశారని నిందితులు తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 91/160 కింద జారీచేసిన ఈ నోటీసులను కొట్టేయాలి’ అని పేర్కొంటూ లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు.
More Stories
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఇంజినీర్ మృతి
తెలంగాణ సంక్షిప్త పదం `టిఎస్’ నుంచి `టిజి’గా మార్పు
రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ సర్కార్