కర్నూలు జిల్లా గూడూరులో 45.5° డిగ్రీలు, విజయనగరం జిల్లా రామభద్రపురంలో 45.2°డిగ్రీలు, పార్వతీపురంమన్యం జిల్లా మక్కువలో 45.1°డిగ్రీలు, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45°డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, మంగళవారం 61 మండలాల్లో తీవ్రవడగాల్పులు,159 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఎండల తీవ్రతకు తెలంగాణ భగభగలాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా దాదాపు ఐదు డిగ్రీల అధికంగా నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా 45డిగ్రీలను దాటి ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం తెలంగాణలో ఆరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములు, జయశంకర్ భేపాలపల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోని పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో 45 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మహబూబాబాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగింది. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాల్పులు వీచాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది మరోవైపు తెలంగాణలో నేడు రేపు పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖం అంచనా వేసింది.
More Stories
ఏపీలో అర్ధరాత్రి వరకు పోలింగ్.. 80 శాతానికి చేరువలో ఓటింగ్
ఏపీలో వైసిపి మూకల దాడులపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
పోలీసుల అదుపులో తెనాలి, తాడిపత్రి వైసిపి ఎమ్యెల్యేలు