మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని పిట్రోడా వ్యాఖ్యానించారు.”అమెరికాలో వారసత్వపు పన్ను ఉంది. ఉదాహరణకు ఒకరి దగ్గర 100 మిలియన్ డాలర్ల విలువైన సంపద ఉంటే ఆయన మరణించిన తర్వాత వారసులకు 45 శాతం మాత్రమే ఇస్తారు. మిగిలిన 55 శాతం సొత్తును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది” అని తెలిపారు.
పైగా, “ఇదో ఆసక్తికరమైన చట్టం. ఈ చట్టం ప్రకారం మీ తరంలో మీరు సంపాదించిన సంపదను ప్రజల కోసం వదిలి వేయాలి. మొత్తం కాదు, కొంత సంపదను వదిలేయాలి. ఇది నాకు న్యాయంగా అనిపిస్తోంది. కానీ భారతదేశంలో ఇది లేదు. ఎవరైనా 10 బిలియన్ల సంపద సంపాదించి చనిపోతే అతని వారసులకు ఆ 10 బిలియన్లు వస్తాయి. ప్రజలకు ఏమీ లభించదు” అని చెప్పారు.
ఇది ప్రజలు చర్చించాల్సిన విషయం అని పేర్కొంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇటువంటి విధానం అమలు పరచాలనే సంకేతం ఇచ్చారు. ఎలాంటి నిర్ణయం తీసకుంటారో తెలీదు కానీ సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కొత్త విధానాలు, కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడాలి. ఈ విధానాలు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలి. ధనవంతుల ప్రయోజనాల కోసం కాదు అను చెప్పుకొచ్చారు.
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా? అని ప్రశ్నించింది. ఒక వ్యాపారవేత్త 55 శాతం సంపదకు, ఒక రైతు 55 శాతం సొత్తుకు భారీ వ్యత్యాసం ఉంటుందని వెల్లడించింది. పిట్రోడా వ్యాఖ్యలు దుమారం రేపడం వల్ల కాంగ్రెస్ ఆత్మారక్షణలో పడింది. ఆ మాటలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చుకుంది.
మరోవైపు ఈ వ్యాఖ్యలపై శామ్ పిట్రోడా ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. ‘కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ప్రధాని మోదీ చేస్తున్న అబద్ధాల నుంచి దృష్టి మరల్చడానికే ఒక వ్యక్తిగా నేను చెప్పిన మాటలను వక్రీకరించడం దురదృష్టకరం. ప్రధాని మోదీ చేసిన మంగళసూత్రం, బంగారం దోచుకోవడం అవాస్తవం. 55శాతం తీసుకుంటామని ఎవరు చెప్పారు? భారతదేశంలో ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు? నేను ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పాను’ అని శామ్ పిట్రోడా వివరించారు.
సంపద పంపిణీపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పంచుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా?” అని ప్రధాని ప్రశ్నించారు.
” మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరు” అంటూ ప్రధాని హెచ్చరించారు.
అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల మంగళ సూత్రాలను కూడా వదలదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు హస్తం పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వివరించా ఇచ్చారు. తన తల్లి సోనియా గాంధీ దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేశారని, రాజీవ్ గాంధీని ఉద్దేశించి ప్రియాంక గుర్తు చేశారు. భారత్ గత 75 ఏళ్లుగా స్వేచ్ఛగా ఉందని గుర్తు చేశారు. 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉందని ప్రజల బంగారాన్ని, మంగళసూత్రాన్ని ఎప్పుడైనా లాక్కుందా? అని ఆమె ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలోభాగంగా బుధవారం ఛత్తీస్గఢ్లోని సుగుజాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ప్రజల సంపదపై సర్వే నిర్వహిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై అధిక పన్నులు భారం మోపడం ద్వారా వారి పిల్లలకు ఆస్తుల లేకుండా చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందని వారించారు.
సోనియా గాంధీ కుటుంబానికి సలహాదారు శ్యామ్ పిట్రోడ్ గతంలో మధ్య తరగతి ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేయాలని సూచించారని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. వంశపారంపర్య పన్ను విధానాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ చూస్తుందని మండిపడ్డారు. మీరు మీ పిల్లలు కోసం కష్టపడి సంపాదించిన సంపాదనను వారికి కాకుండా చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవంక, సంపద పంపిణీ అంశంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ తప్పుపట్టారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా రాహుల్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను తప్పుపట్టిన ఆయన.. అధికారంలోకి రాలేమని అనుకున్న పార్టీలే అలాంటి హామీలు ఇస్తుంటాయని ఆయన పేర్కొన్నారు.
దేశాన్ని తలకిందులుగా మార్చాలని కాంగ్రెస్ భావిస్తోందని, వాళ్లు చేసిన వాగ్ధాలను చూస్తే, ఏది చేసైనా అధికారంలోకి రావాలన్న కాంక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు కనిపిస్తోందని దేవగౌడ తెలిపారు. సంపద పంపిణీ గురించి రాహుల్ మాట్లాడుతూ ఇద్దరు మాజీ ప్రధానులను ఆయన అవమానించినట్లు దేవగౌడ తెలిపారు.
మార్కెట్ సంస్కరణలు చేపట్టి, దేశ సంపదను ఆ ప్రధానులు పెంచారని గుర్తు చేశారు. మాజీ ప్రధానులు పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్.. దేశంలో ఆర్థిక సరళీకరణ తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆ ఇద్దరు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలను రాహుల్ గాంధీ రద్దు చేయాలని చూస్తున్నట్లు ఆరోపించా
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది