ఇకపై ఐరోపా దేశాలకు వెళ్లే భారతీయులకు యూరోపియన్ యూనియన్ శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఈయూ నూతన వీసా విధానాన్ని ప్రకటించింది. షార్ట్ స్టే వీసా అయిన షెంగెన్ వీసాతో ఐరోపా దేశాలకు వెళ్లే భారతీయులు ఇదివరకు ఆ వీసా కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయాల్సి వచ్చేది. నూతన విధానం ప్రకారం ఇకపై ఆ అవసరం ఉండదు.
షార్ట్ స్టే షెంగెన్ వీసాకు బదులుగా ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యేలా మల్టిపుల్ ఎంట్రీ షెంగెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈయూ భారతీయులకు కల్పించింది. ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీని బట్టి వీసాలపై వ్యాలిడిటీ ఉంటుంది. ఐరోపా సమాఖ్య ఏప్రిల్ 18న భారతీయ పౌరులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాల జారీపై నిర్దిష్ట నిబంధనలను ఆమోదించింది. ఇది ప్రస్తుత వీసా ప్రామాణిక నిబంధనల కంటే చాలా సులభతరంగా ఉంటుంది.
కొత్తగా వచ్చిన వీసా ‘క్యాస్కేడ్’ విధానం ప్రకారం.. భారతీయ పౌరులకు ఇప్పుడు దీర్ఘకాలిక, బహుళ-ప్రవేశాల కోసం షెంగెన్ వీసాలను జారీ చేయనున్నారు. ఇందుకు అర్హత సాధించాలంటే గత మూడేళ్లలో కచ్చితంగా రెండుసార్లు వీసా ఆమోదం పొంది ఉండాలి. చట్టబద్ధంగా ఆ వీసాను వాడుకుంటే తర్వాత రెండేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ