వాయనాడ్ నుంచి కూడా రాహుల్ ను తరిమికొడతారు

రాహుల్ గాంధీని ఈ ఎన్నికల్లో తన పార్లమెంటరీ నియోజకవర్గం వయనాడ్ నుంచి కూడా ప్రజలు తరిమికొడతారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు మరో సురక్షితమైన సీటును వెతకాల్సి ఉంటుందని ప్రధాని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ శనివారం ఉత్తర

ప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోట వంటిది. కానీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ కుటుంబానికి కంచుకోటయిన రాయబరేలిని సోనియా గాంధీ వదిలిపెట్టి రాజ్యసభను ఎంచుకున్నారు.

తాజాగా, ఆ విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ  2019 లో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ అమేథీ నుంచి పారిపోయేలా చేసిందని, ఇప్పుడు కేరళ లోని వాయినాడ్ నియోజకవర్గం నుంచి కూడా పారిపోయే పరిస్థితి ఏర్పడిందని ప్రధాని మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

“కాంగ్రెస్ లో సంక్షోభం స్పష్టంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 26న పోలింగ్ పూర్తికాగానే తమ యువరాజు కోసం కాంగ్రెస్ నేతలు మరో సురక్షితమైన నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి ఉంది.  అమేథీలో ఓటమి  అనంతరం పరిగెత్తిపోయి ఇక్కడకు వచ్చిన విధంగా, ఇప్పుడు వాయనాడ్ నుండి కూడా పరిగెత్తాల్సి వస్తుంది”’’ అని చెప్పారు.
విపక్ష కూటమి ఇండియాలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు ఈ లోక్ సభ ఎన్నికల్లో దాదాపు 25 శాతం సీట్లలో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. ఆ కూటమిలో ఒకరైన కేరళ సీఎం పినరయి విజయన్ కాంగ్రెస్ నేతలను తాను కూడా ఉపయోగించని భాషలో దూషించారని ప్రధాని గుర్తు చేశారు. 

లోక్ సభ ఎన్నికల తొలి దశలో దేశ ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఓటేశారని ప్రధాని మోదీ భరోసా వ్యక్తం చేశారు. మొదటి దశ పోలింగ్ లో ప్రజలు ఇండియా కూటమిని పూర్తిగా తిరస్కరించారని ఆయన స్పష్టం చేశారు.  ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా విపక్ష పార్టీల కోసం ఎందుకు పని చేస్తున్నారని పేర్కొంటూ మీరంతా ప్రజాస్వామ్యం కోసం కష్టపడాలని విపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలకు ప్రధాని మోదీ సూచించారు. 

ఈ రోజు కాకపోతే, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు, మీకు అవకాశం వస్తుందని వారికి హామీ ఇచ్చారు. అమేథీ, రాయబరేలీ లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడాన్ని మోదీ గుర్తు చేశారు. తమకు ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో వారి పార్టీకి అభ్యర్థి లేనందున తొలిసారిగా ఆ కుటుంబం కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయలేదని గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ప్రధాని పేర్కొన్నారు.