ఎలక్టోరల్ బాండ్స్ తో పాదర్శకత పెరిగిందని నిర్మలా సీతారమన్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు విరాళాలు అందిచేదే ఈ ఎలక్టోరల్ బాండ్స్. 2018లో చట్టం రూపంలో దీనిని ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం. పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకునే వారు ఎస్బీఐలో ఈ బాండ్స్ని కొనుగోలు చేయాల్సి వచ్చేది.
అయితే, ఎన్నికల బండ్లపై ఇచ్చిన తీర్పును తిరిగి సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. ఎలక్టోరల్ బాండ్స్ని నిర్మలా సీతారామన్ మద్దతివ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ స్కీమ్కు సానుకూలంగా మాట్లాడారు. ఎన్నికల నిధులను పారదర్శకంగా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుందని గతంలో ఆమె చెప్పారు.
ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయిస్తున్న నేతలపై నేరారోపణలు ఉన్నప్పటికీ బీజేపీ పట్టించుకోలేదని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ఆమె మండిపడ్డారు. “మీరు ఈరోజే నా పార్టీలోకి రండి, రేపు కేసు ముగుస్తుందని బీజేపీ ఇక్కడ కూర్చుని చెప్పదు. కేసు కోర్టుల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది, అది కాల్ తీసుకోవాల్సి ఉంటుంది; వారు కేవలం “ఓహ్, అతను మీ పార్టీకి వచ్చాడు, కేసును ముగించు” అని చెప్పరు. అలా జరగదు” అని ఆమె స్పష్టం చేశారు.
కాబట్టి ఈ వాషింగ్ మెషీన్ కోర్టుల కోసం వారు ఉపయోగించాలనుకుంటున్న పదమా? అని ఆమె ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఊపును కొనసాగించేందుకు ఆమె రోడ్ మ్యాప్ను కూడా రూపొందించారు. “విధాన రూపకల్పనలో స్థిరత్వం. పన్నుల ప్రక్రియ సరళీకరణ. జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ. దేశంలోకి పెట్టుబడులు రావడాన్ని సులభతరం చేయడం” గా ఆమె వివరించారు.
ఈ విషయాలలో కేవలం కేంద్ర ప్రభుత్వం నుండి మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగు కృషి చేయాల్సి ఉంటుందని, స్థానిక సంస్థల స్థాయిలో కూడా సరళమైన విధానాలను తీసుకు రావాల్సి ఉంటుందని ఆర్ధిక మంత్రి వివరించారు.
1960ల చివరి నుంచి ఏ జాతీయ పార్టీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉనికిని కలిగి ఉండని తమిళనాడులో తీవ్రమైన బిజెపి ప్రచారం గురించి అడిగినప్పుడు, సీతారామన్ రాష్ట్రానికి స్పష్టమైన వ్యత్యాసం ఉందని చెప్పారు. అసెంబ్లీకి స్థానిక ప్రాంతీయ పార్టీలు, పార్లమెంటుకు జాతీయ పార్టీ ముందుంటాయని చెప్పారు. అయితే అక్కడ కాంగ్రెస్ ద్రావిడ పార్టీలకు వదిలేసి తప్పుకుందని ఆమె చెప్పారు.
“ఢిల్లీ నుండి జరిగే ప్రతిదీ, తమిళనాడుకు ప్రయోజనం కలిగిస్తుంది. తమిళనాడు అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఈ విషయమై తగు అవగాహన కల్పించే ప్రయత్నం చేయకుండా వారు దానిని ప్రాంతీయ పార్టీకి వదిలివేశారు” అంటూ ఆమె వివరించారు.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ