రూ 100 కోట్ల శిల్పాశెట్టి భర్త ఆస్తుల ఈడీ జ‌ప్తు

సీనియ‌ర్ బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమెతోపాటు ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన దాదాపు  రూ.100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గురువారం జప్తు చేసింది. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్ ముంబై సిటీ జూహూ ఏరియాలో శిల్పాశెట్టి పేరుతో ఉన్న అపార్ట్ మెంట్ ఫ్లాట్, అదే విధంగా పూణెలో శిల్పాశెట్టి పేరుతో ఉన్న బంగ్లా ఉన్నాయి. 

రాజ్ కుంద్రా పేరుతో ఉన్న ఈక్విటీ షేర్లను సైతం సీజ్ చేసింది ఈడీ. బిట్‌కాయిన్ ఫ్రాడ్ కేసులో ఆ ఆస్తుల్ని సీజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ప‌లు ఫిర్యాదుల ఆధారంగా ఈడీ ఈ కేసులో ద‌ర్యాప్తు చేప‌ట్టింది. రాజ్‌కుంద్రా సంస్థ 2017లో బిట్‌కాయిన్ల రూపంలో సుమారు 6600 కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

నెల‌కు ప‌ది శాతం రిట‌ర్న్స్ ఇస్తామ‌ని చెప్పి ఇన్వెస్ట‌ర్ల‌ను మోసం చేసిన‌ట్లు కేసు ఫైల్ చేశారు. ఈ స్కీమ్‌లో మాస్ట‌ర్‌మైండ్ అయిన అమిత్ భ‌ర‌ద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా సుమారు 285 బిట్‌కాయిన్లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆ బిట్‌కాయిన్ల‌తో ఉక్రెయిన్‌లో మైనింగ్ ఫార్మ్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీకి కేసును అప్పగించారు. కొన్నేండ్లుగా ఈడీ ఈ కేసుపై దర్యాప్తు చేస్తుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 నిబంధనల ప్రకారం రిపు సుదన్ కుంద్రా (రాజ్ కుంద్రా)కు చెందిన రూ. 97.79 కోట్లు జప్తు  చేస్తున్నట్టు ఈడీ తెలిపింది. ఇందులో రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి పేరు మీద ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్ కూడా ఉంది. పూణేలో ఉన్న రెసిడెన్షియల్ బంగ్లాను అటాచ్ చేస్తున్నట్టు ఈడీ వెల్లడించింది.