![](https://nijamtoday.com/wp-content/uploads/2023/07/Pawan-yatra-1.webp)
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపితో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్న టిడిపి, జనసేన నేతలు పొరుగు రాష్ట్రాలలో తెలుగు వారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థుల ప్రచారం కోసం వెడుతున్నారు. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులోని కోయింబత్తూరులో పోటీ చేస్తున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలైకు మద్దతుగా ప్రచారం చేసేందుకు గురువారం వెళ్లారు. ఆయన అక్కడ 11, 12 తేదీలలో ప్రచారంలో పాల్గొంటున్నారు.
కాగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ 17న కర్ణాటకలో బిజెపి అభ్యర్థుల ప్రచారంకోసం వెడుతున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలలో గత ఏడాది అధికారం కోల్పోయిన బిజెపి ఈసారి లోక్ సభ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలు గెల్చుకొనేందుకు పట్టుదలతో పనిచేస్తున్నది.
More Stories
ఏపీలో హత్యకు గురైన వారి పేర్లు చెప్పమని చంద్రబాబు సవాల్!
వైసిపి ఆర్ధిక దోపిడీతో ఏపీకి రూ. 76,795 కోట్ల నష్టం
కాంట్రాక్టర్లను మార్చడంతోనే పోలవరం పనుల్లో జాప్యం