వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

వేసవి సెలవుల నేపథ్యంలో నగరాల నుంచి సొంతూళ్లకు పయమవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీ పెరిగింది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. దీంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల మధ్య 48 ప్రత్యేక రైళ్లు నడుప‌నున్న‌ట్టు దక్షిణ మధ్య రైల్వే ప్ర‌క‌టించింది..

సికింద్రాబాద్ – నాగ‌ర్‌సోల్‌, తిరుపతి – మచిలీపట్నం మధ్య స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్ర‌క‌టించింది. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ స్పెషల్ రైళ్లు నడుస్తాయని తెలిపింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏప్రిల్ 17, 24 మే 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక రైళ్లు (07517) బయలుదేరి… మరుసటి ఉదయం 8 గంటలకు నాగ‌ర్‌సోల్‌ చేరుకుంటాయి. నాగ‌ర్‌సోల్‌ నుంచి ఏప్రిల్ 18, 25 మే 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 10 గంటలకు స్పెషల్ ట్రైన్లు(07518) బయలుదేరి… మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది.

అదేవిధంగా.. తిరుపతి నుంచి ఏప్రిల్ 14, 21, 28.. మే 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10.20 గంటలకు ప్ర‌త్యేక రైలు (07121) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఇక‌ మచిలీపట్నం నుంచి ఏప్రిల్ 15, 22, 29.. మే 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరి… మరుసటి రోజు తెల్లవారుజామున 3.20 గంటలకు (07122) తిరుపతికి చేరుకుంటుంద‌ని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.