గుండ్లకమ్మ- దర్శి మధ్య కొత్త రైల్వే లైన్

గుండ్లకమ్మ – దర్శి మధ్య కొత్త రైల్వే లైన్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. నడికుడి – శ్రీకాళహస్తి సెక్షన్‌లో 27 కిలోమీటర్ల లైన్‌ నిర్మాణం పూర్తి చేశారు. రైళ్ల రాకపోకలకు మూడు రోజుల క్రితం ప్రారంభించారు. ఈ కొత్త రైల్వే మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నడికుడి – శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించారు.

విద్యుదీకరించని రైలు విభాగంలోని రైళ్లు గరిష్టంగా 75 కి.మీ / వేగంతో నడపడానికి అనుమతించినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. నడికుడి – శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ దక్షిణ మధ్య రైల్వే ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ముఖ్యమైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని ఎగువ ప్రాంతాలను కలుపుతూ కొత్త ప్రాంతాలతో ఏర్పాటు చేసిన రైలు నెట్‌వర్క్‌‌‌తో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టును 2011-12 సంవత్సరంలో 309 కి.మీ.ల మేర రూ. 2,289 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేశారు . భారతీయ రైల్వేలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య 50 శాతం వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికతో, అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే ఒప్పందంపై ఈ నిర్మాణం చేపట్టారు.

పిడుగురాళ్ల – శావల్యాపురం మధ్య 47 కిలోమీటర్ల మేర మొదటి సెక్షన్‌ ఇప్పటికే పూర్తి చేసి విద్యుదీకరణతో పాటుగా ప్రారంభించారు. నడికుడే- పిడుగురాళ్ల మధ్య ఉన్న సెక్షన్ బీబీనగర్‌ను గుంటూరుతో కలిపే లైన్‌లో ఉంది . శావల్యాపురం-గుండ్లకమ్మ మధ్య ఉన్న సెక్షన్ గుంటూరును గుంతకల్‌తో కలిపే ప్రస్తుత రైలు మార్గంలో వస్తుంది. 

ఇప్పుడు, గుండ్లకమ్మ – దర్శి మధ్య 27 కి.మీల విస్తరణ పూర్తి చేయడంతో పాటు ప్రారంభించడంతో, నడికుడి – దర్శి మధ్య నిరంతరాయంగా 122 కిలోమీటర్ల రైలు మార్గము, రైలు రాకపోకలు నిర్వహణకు అందుబాటులో ఉంటాయి. విజయవాడ – చెన్నై మధ్య ప్రస్తుత కోస్టల్ రైల్వే లైన్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా దీనిని ఉపయోగించవచ్చు.