ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో అందరూ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పైగా, ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రగిలించారు.
దానితో ఇప్పుడు మార్చి 27 నుండి ప్రధాన ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఒకేరోజున రాయలసీమ నుండి తమ ప్రచార యాత్రలు ప్రారంభిస్తున్నారు. పైగా, ఇద్దరూ సొంత జిల్లాల నుండి ఒకే రోజున ప్రచారంకు శ్రీకారం చుట్టడం ఆసక్తిగా మారింది. అయితే మార్చి 29 వ తేదీ మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకేసారి పర్యటించనున్నారు.
మార్చి 27 తేదీ నుంచి ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా టీడీపీ ప్రణాళిక రూపొందించింది. 27 తేదీ నుంచి 31 తేదీ వరకు పర్యటనను ఖరారు చేశారు. మార్చి 27వ తేదీ పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
28వ తేదీ రాప్తాడు, సింగనమల, కదిరిలలో చంద్రబాబు పర్యటిస్తారు. ఇక మార్చి 29వ తేదీ శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రజాగళం యాత్ర సాగనుంది.30 మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో పర్యటించనున్న చంద్రబాబు.. మార్చి 31వ తేదీ కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
మరోవైపు మార్చి 27 నుంచే సీఎం జగన్ సైతం తన ఎన్నికల ప్రచారం షురూ చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సిద్ధం సభలకు కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో జగన్ బస్సు యాత్ర జరగనుంది. మార్చి 27న ప్రొద్దుటూరులో సభ నిర్వహిస్తారు. మార్చి 28న నంద్యాలలో బహిరంగ సభ. 29న ఎమ్మిగనూరులో సభ జరగనుంది.
More Stories
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల
అంగన్వాడీ కార్యకర్తలు, ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ విధులు