మంచి ఉద్దేశ్యంతోనే ఎన్నికల బాండ్లు

మంచి ఉద్దేశ్యంతోనే ఎన్నికల బాండ్లు
ఎన్నికల బాండ్ల పధకాన్ని ఒక ”మంచి ఉద్దేశం”తోనే 2017లో కేంద్ర ప్రవేశ ప్రవేశపెట్టినట్టు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు. నిధులు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదని చెప్పారు. ఈ పెద్దకం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది.  గాంధీనగర్‌ సమీపంలోని గిఫ్ట్ సిటీలో మీడియా హౌస్‌ నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరి మాట్లాడుతూ, ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తదుపరి ఆదేశాలు ఇచ్చినా అన్ని రాజకీయాల పార్టీలు కలిసి కూర్చుకుని దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని సూచించారు.

”అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నికల బాండ్లకు సంబంధించిన చర్చలో నేను పాల్గొన్నాను. వనరులు లేకుండా ఏపార్టీ కూడా మనుగడ సాగించలేదు. కొన్ని దేశాల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలే నిధులు ఇస్తాయి. భారత్ లో అలాంటి విధానం లేదు. అందువల్ల రాజకీయ పార్టీలకు ఆర్థిక వనరుల కోసం ఈ పధకాన్ని తెచ్చాం” అని గడ్కరి తెలిపారు.

రాజకీయ పార్టీలకు నేరుగా నిధులు అందాలన్నదే ఎన్నికల బాండ్ల ప్రధాన ఉద్దేశమని, అధికార మార్పిడి జరిగితే సమస్యలు తలెత్తకుండా ఉండేందుతే విరాళాలు ఇచ్చిన వారి పేర్లు వెల్లడించడం లేదని గడ్కరీ చెప్పారు. ఏదైనా మీడియా హౌస్ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే అందుకు స్పాన్సరర్ అవసరమవుతారని, అలాగే రాజకీయ పార్టీలు కూడా తమ కార్యకలాపాలు కొనసాగించాలంటే నిధులు అవసరమవుతాయని ఆయన పోలిక తెచ్చారు. 

నిధులు లేకుండా పార్టీలు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాయనే వాస్తవ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరారు. అందుకోసమే పారదర్శకమైన ఎన్నికల బాండ్లను స్కీమ్ తెచ్చామని పేర్కొన్నారు. వీటిని  తెచ్చినప్పుడు తమ ఉద్దేశం మంచిదేనని వివరించారు. సుప్రీంకోర్టుకు ఏదైనా లోటుపాట్లు కనిపిస్తే వాటిని సవరించమని తమను కోరవచ్చని, దానిపై అన్ని పార్టీలతో కలిసికట్టుగా చర్చిస్తామని గడ్కరి చెప్పారు.