ముందుగా పుతిన్తో మాట్లాడిన మోదీ ఇటీవలే జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలుపొంది అత్యున్నత పదవి చేపట్టినందుకు ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఉక్రెయిన్తో వివాద పరిష్కారానికి చర్చలు, దౌత్యపరమైన చర్యలే మేలని సూచించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఇరు దేశాల బంధం మరింత బలపడాలని, కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలను రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించినట్లు మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులు, పలు అంతర్జాతీయ అంశాలపైనా నేతలతో చర్చించినట్లు విదేశాంగ శాఖ పేర్కొన్నారు.
అదేవిధంగా భారత్- ఉక్రెయిన్ బంధం బలోపేతం చేయడంపై అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ చర్చించారు. భారత్- ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, కాల్పుల విరమణపై చర్చించినట్లు ప్రధాని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. రష్యాతో రెండేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
‘శాంతి కోసం అన్ని ప్రయత్నాలకు భారతదేశం కట్టుబడి ఉంది. ఇరుదేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. చర్చలు, దౌత్య మార్గాల్లో యుద్ధం ముగింపునకు ప్రయత్నిస్తామని జెలెన్స్కీకి మోదీ చెప్పారు. అదే సమయంలో ఉక్రెయిన్కు మానవతా సహాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
More Stories
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
భారత్ తో వాణిజ్య సంబంధాలకై పాక్ ప్రధానిపై వత్తిడి